‘‘నేను దర్శకుడి కంటే ముందు రచయితను. అంతకంటే ముందు ఓ మధ్య తరగతి మనిషిని. మన ఆలోచనలు గొప్పవైతే గొప్పగా ఎదుగుతాం. తక్కువైతే వెనకబడిపోతాం. ప్రపంచం బాగుండాలంటే ఇద్దరు మనుషులు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మామూలు కథను బలంగా చెప్పాలనుకుని ఈ చిత్రం చేశా. బూతులు లేని వినోదం పంచడానికి మొదటి నుంచీ నేను ప్రయత్నిస్తున్నా. అందుకే కొంచెం ఆలస్యమైనా మంచినే చెప్పాలనిపిస్తుంది. బిర్యానీ, మసాలాలు తిన్న మనకు ఫుడ్ పాయిజినింగ్ అయితే డాక్టరు చారన్నం తినమంటాడు.
నా దృష్టిలో ఈ చిత్రం చారన్నంలాంటిది’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ‘అ..ఆ...’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ -‘‘ ‘సై’ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు గుంటూరుకు వచ్చా. ‘అ.. ఆ’ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్కు సమానంగా పేరొచ్చింది.
ఈ చిత్రానికి అసలైన హీరో త్రివిక్రమ్గారే. ఈ విజయం నాకెంతో కీలకం. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘నితిన్ను యాభై కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లినందుకు త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్. నితిన్ టార్గెట్ ఇప్పుడు వంద కోట్లు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. త్రివిక్రమ్, రాధాకృష్ణ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పీడీవీ ప్రసాద్ చిత్రబృందానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్లు అందించారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, నటీనటులు నదియా, హరితేజ, శ్రీనివాసరెడ్డి, అజయ్, మధునందన్, పాటల రచయిత కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.
చారన్నంలాంటి సినిమా - త్రివిక్రమ్
Published Tue, Jun 14 2016 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement