‘‘నేను చిన్ననాటి నుంచి తెలుగు సినిమాలను చూస్తూ పెరిగాను. అందుకే సినిమా మీద ప్రేమతో ఐర్లాండ్లో డిప్లొమా ఇన్ స్క్రీన్ప్లే, లండన్లో డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ పూర్తి చేశాను. ‘ఆకతాయి’ సినిమాలో కొత్త ప్రయోగాలు చేశాను’’ అని రామ్ భీమన అన్నారు. ఆశిష్రాజ్, రుక్సార్ మీర్ జంటగా విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ భీమన చెప్పిన విశేషాలు...
► పాయింట్ ఆఫ్ వ్యూ అనే టెక్నాలజీని మొదటిసారి ఈ సినిమాలో ప్రయోగించాను. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ టెక్నాలజీతో సీన్స్ తీయడం ఇదే మొదటిసారి. నాకు కమర్షియల్ సినిమా అంటే పిచ్చి. ఎందుకంటే కామెడీ, ఫైట్స్, పాటలు.. ఇలా అన్ని ఒకే చోట దొరికేది కమర్షియల్ సినిమాలోనే. ‘ఆకతాయి’ హైలెట్స్ గురించి చెప్పుకోవాలంటే టెక్నాలజీతో పాటు మణిశర్మ సంగీతం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమా పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు. మణిశర్మ గారు నాతో మాట్లాడుతూ – ‘నాకు ఇది చాలా చిన్న సినిమా అని చెప్పి రెమ్యూనరేషన్ మాట్లాడారు. కానీ, చిన్న సినిమాల్లో ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది’ అన్నారు. ప్రతి పది నిమిషాలకు సినిమాలో ఒక్కో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉంటుంది.
► ఈ సినిమా పాయింట్ గురించి చెప్పాలంటే... ఇది ఒక రివెంజ్ సబ్జెక్ట్. హీరో చాలా తెలివైనవాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై విపరీతమైన పట్టు ఉంటుంది. తనకు వచ్చిన సమస్యను టెక్నికల్ నాలెడ్డ్తో ఎలా పరిష్కరించాడన్నదే చిత్రకథ.
► ‘దావతే ఇష్క్’ అనే హిందీ మూవీలో ఈ చిత్రకథానాయికుడు ఆశిష్రాజ్ గెస్ట్ రోల్ చేశాడు. గతంలో ఆశిష్ థియేటర్ ఆర్టిస్టు. రుక్సార్ మీర్ మా చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఇద్దరూ అద్భుతంగా నటించారు. ‘గజిని’ తరువాత తనకు గుర్తుండిపోయే విలన్ పాత్రల్లో ఈ చిత్రంలోని పాత్ర నిలుస్తుందని ప్రదీప్ రావత్ అన్నారు. అమీషా పటేల్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్న సినిమా ఇది. ఆమె చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్.
► ఈ చిత్ర నిర్మాతలు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో పేరు సంపాదించారు. సినిమాపై ఉన్న ప్రేమతో నిర్మాతలుగా మారారు. పేరుకి ఇది చిన్న సినిమా అయినా పెద్ద చిత్రానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఖర్చుకి వెనకాడకుండా తీశారు.
తెలుగు సినిమా అంటే పిచ్చి!
Published Thu, Mar 2 2017 11:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement