ఇద్దరు హీరోలు ఫ్రీడమ్‌ ఇచ్చారు | Sakshi
Sakshi News home page

ఇద్దరు హీరోలు ఫ్రీడమ్‌ ఇచ్చారు

Published Sun, May 13 2018 2:17 AM

Aatagallu Movie First Look  release - Sakshi

నారా రోహిత్, జగపతిబాబు ముఖ్య తారలుగా పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లమూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘ఆటగాళ్ళు’. ‘గేమ్‌ ఫర్‌ లైఫ్‌’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను జగపతిబాబు, నారా రోహిత్‌ కలిసి విడుదల చేశారు. జగపతిబాబు మాట్లాడుతూ–‘‘మురళి కథ చెప్పినప్పుడు..‘నాకు హీరోగా మార్కెట్‌ లేదు. విలన్‌గా ఉందని’ చెప్పి వెనక్కి పంపాను. కానీ మురళి పట్టువదలకుండ రోహిత్‌ను ఒకే చేసుకుని వచ్చాడు. రోహిత్‌ పాత్ర చేయడానికి ఎవరూ సాహసించరు. కథను నమ్మి పాత్ర చేసిన రోహిత్‌కు అభినందనలు’’ అన్నారు.

నారా రోహిత్‌ మాట్లాడుతూ – ‘‘జగపతిబాబు గారితో ఫస్ట్‌టైమ్‌ వర్క్‌ చేశా. ఇలాంటి జోనర్‌ చేయడం ఇదే ఫస్ట్‌టైమ్‌. నా పాత్ర నాకే కొత్తగా అనిపించింది’’అన్నారు.‘‘పెదబాబు’ తర్వాత జగపతిబాబుగారితో చేసిన చిత్రమిది. ఫ్రీడమ్‌ ఇచ్చిన ఇద్దరు హీరోలకు థ్యాంక్స్‌. నా ముగ్గురు మిత్రులతో పాటు నేనూ నిర్మాతగా మారా. టెక్నీషియన్స్‌ చాలా కష్టపడ్డారు’’ అన్నారు దర్శకుడు పరుచూరి మురళి. వాసిరెడ్డి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ–‘‘షూటింగ్‌ పూర్తి అయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, ట్రైలర్‌లను విడుదల చేసి ఆ నెక్ట్స్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయికార్తీక్, ఫణిలతో పాటు ఇతర నిర్మాతలు, టెక్నీషియన్స్‌  పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement