తమిళసినిమా: ఆ సంఘం కార్యదర్శిగా సభ్యుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు విశాల్. ఇటీవల తమిళ నిర్మాతల పనితీరును ఎండగడుతూ విశాల్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఆ సంఘం నుంచి బహిష్కరణకు గురి చేశాయి. అయితే ఆయన చట్టబద్ధంగా పోరాడి అక్కడా గెలిచారు. అలాగే నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేస్తానని విశాల్ ప్రకటించారు. ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే కుట్రలు సాగాయని చెప్పవచ్చు. అడ్డంకుల్ని ఎదుర్కొని నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేశారు. విశాల్ ఓటమి లక్ష్యంగా కొన్ని జట్లు ఏకం కూడా అయ్యాయి. అయితే వారి కుట్రలు, వ్యూహాలు విశాల్ ముందు పారలేదు. ఆయనకే పట్టంకడుతూ తీర్పు వెలువడింది.
త్రిముఖ సమరంగా రాజకీయ ఎన్నికల వాతావరణాన్ని తలపించిన తమిళ నిర్మాతల ఎన్నికలు ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక అన్నానగర్లోని కందస్వామి కళాశాలలో జరిగాయి. గట్టి పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికల అధికారిగా నియమితులైన మద్రాస్ హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి రాజేశ్వరన్ పర్యవేక్షణలో ఉత్కంఠభరితంగా జరిగాయి.ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి విశాల్, రాధాకృష్ణన్, కేఆర్ పోటీ పడగా, కార్యదర్శి పదవికి దర్శకుడు మిష్కిన్, జ్ఙానవేల్ రాజ, ఏఎల్ అలగప్పన్, జేఎస్కే సతీష్ కుమార్, కదిరేషన్, మన్నన్, శివశక్తి పాండిన్ బరిలో దిగారు. కాగా కోశాధికారి పదవికి ఎస్.ఆర్.ప్రభు, బాబు గణేష్, ఎస్ఏ చంద్రశేఖరన్, విజయ్ మురళీ పోటీపడ్డారు. రెండు ఉపాధ్యక్ష పదవుల కోసం ప్రకాశ్రాజ్, గౌతమ్మీనన్, రాజన్, సురేష్, పవిత్రన్, ఏఎం రత్నం, రంగారెడ్డి, పీటీ సెల్వకుమార్ మొదలగువారు పోటీకి దిగారు. వీటితోపాటు 21 కార్యవర్గ సభ్యుల పదవుల కోసం 86 మంది బరిలో ఉన్నారు.
ఎన్నికలు సాయంత్రం 4.15 గంటలకు ముగిశాయి. రజనీకాంత్, కమల్హాసన్ మొదలగు సినీ ప్రముఖులు పలువురు ఓటింగ్లో పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ ఎన్నికల్లో విశాల్ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇందులో విషాల్కు 478 ఓట్లు పోల్ కాగా, రాధాకృష్ణన్కు 335, కేఆర్కు 224 ఓట్లు దక్కాయి. ఓటింగ్ సమయంలో వివాదాలు సైతం సాగాయి. ఓ సందర్భంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసినా పోలీసులు రంగప్రవేశంతో సద్దుమణిగింది.
ధన్యవాదాలు : గెలుపనంతరం విశాల్ మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపించిన నిర్మాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. చిరు నిర్మాతలకు మాత్రమే కాకుండా నిర్మాతలందరికీ దక్కాల్సిన ఆదాయాన్ని అందేవిధంగా చూస్తామన్నారు. అదేవిధంగా పైరసీ, కేబుల్ టీవీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నిర్మాతల మండలి ప్రధాన లక్ష్యం ఏమిటంటే రాష్ట్ర రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు. నిర్మాతలకు రావాల్సిన సబ్సిడీ గురించి ప్రభుత్వంతో చర్చించి రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇది యువత కృషికి ప్రతిఫలమే ఈ విజయం అన్నారు.
విశాల్కే పట్టం
Published Mon, Apr 3 2017 3:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement