కొడి నుంచి ఆమెను తొలగించిదెవరు? | Sakshi
Sakshi News home page

కొడి నుంచి ఆమెను తొలగించిదెవరు?

Published Thu, Jun 23 2016 2:11 AM

కొడి నుంచి ఆమెను తొలగించిదెవరు? - Sakshi

కొడి చిత్రం నుంచి నటి షామిలిని ఎవరు తప్పించారన్న ఆసక్తికరమైన విషయాలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బాల నటిగా అబ్బుర పరచిన నటి షామిలి. జాతీయ అవార్డును గెలుచుకున్న షామిలి ఆ తరువాత తెలుగులో ఓయ్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత షామిలి అమెరికాకు వెళ్లి సినిమాకు సంబంధించిన కోర్స్ చేసి చెన్నైకి తిరిగి వచ్చారు.
 
  కోలీవుడ్‌లో కథానాయకిగా పలు అవకాశాలు వచ్చినా ఆచి తూచి అడుగేసిన షామిలి రెండు చిత్రాలకు పచ్చ జెండా ఊపారు.అందులో ఒకటి ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో నటించడానికి ఎంపికయ్యారు. ఇందులో మరో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. మరో చిత్రం వీరశివాజి. విక్రమ్‌ప్రభు సరసన నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో షూటింగ్‌కు ముందే ధనుష్ చిత్రం నుంచి షామిలిని తొలగించారు.
 
 ఆమెకు బదులు నటి కీ ర్తీసురేశ్‌ను ఎంపిక చేశారు.అయితే కొడి చిత్రం నుంచి తనను ఎందుకు తొలగించారో కారణం తెలియక అయోమయంలో పడ్డారు షామిలి. తాజాగా ఈ సంఘటన గురించి కొన్ని విషయాలు కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కొడి చిత్రంలో హీరోయిన్‌గా షామిలిని దర్శకుడు చెప్పడంతో ధనుష్ ఓకే చెప్పారట.అయితే ఆయనకు ఆరంభం నుంచే షామిలి నటించడం ఇష్టం లేద ని సమాచారం.
 
  తన చిత్రానికి సంబంధించిన అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే ధనుష్ కొడి చిత్ర షూటింగ్‌కు బయలు దేరే ముందు అనూహ్యంగా నటి షామిలి వద్దని చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే నటుడు విజయ్‌తో కొంత కాలంగా ధనుష్ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. విజయ్ కూడా ధనుష్ నా కంటే మంచి నటుడు అని ప్రశంసించడం గమనార్హం.
 
 ఇలాంటి పరిస్థితిలో నటుడు అజిత్ మరదలైన షామిలితో కలిసి నటించడం మంచిది కాదని సన్నిహితులు ధనుష్ చెవిలో ఊదినట్లు, ఇలాంటి కారణాల వల్లే కొడి చిత్రం నుంచి షామిలిని తొలగించినట్లు కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. షామిలి విక్రమ్‌ప్రభుకు జంటగా నటించిన వీరశివాజీ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంతో షామిలి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారన్నమాట.
 

 

Advertisement
Advertisement