ఊహకందని కోణాలు | Sakshi
Sakshi News home page

ఊహకందని కోణాలు

Published Sun, Jul 20 2014 12:28 AM

ఊహకందని కోణాలు

అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా మూన్‌లైట్ డ్రీమ్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాథరెడ్డి రూపొందించిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. వచ్చే నెల 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ -‘‘ఓ భిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఊహకందని కోణాలు ఈ కథలో ఉంటాయి. సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయాలనే లక్ష్యంతో చేశాం. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం టేకింగ్ మాత్రం హాలీవుడ్ స్టయిల్‌లో ఉంటుంది. దర్శక, నిర్మాతగా నాకు మాత్రమే కాదు... నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement