లార్డ్స్: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారతీయులకు సోమవారం క్షమాపణలు తెలిపారు. మహిళల ప్రపంచకప్ ఫైనల్కు అక్షయ్ హాజరై భారత మహిళలకు తన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. స్టాండ్స్లో మిథాలీ సేనకు మద్ధతుగా హడావిడి చైస్తూ ప్రేక్షకులను అలరించాడు. మైదానంలో భారత మహిళలు రాణిస్తుంటే సంతోషం వ్యక్తం చేస్తూ హడావిడిలో భారత త్రివర్ణపతాకాన్ని తలకిందులుగా ఊపాడు.
ఈ ఫోటో ట్వీటర్లో పోస్టు చేశాడు. అయితే భారత పతాకాన్ని తలకిందులుగా ఎగరేయాడాన్ని గమనించిన నెటిజన్లు అక్షయ్ను తప్పుబట్టారు. దీంతో తప్పును గుర్తించిన అక్షయ్ ఆ ట్వీట్ను డిలీట్ చేసి భారత అభిమానులకు బేషరతు క్షమాపణలు తెలియజేస్తూ మరో ట్వీట్ పోస్టు చేశాడు.
Extending my sincerest apology for violating the code of conduct for the tricolor.Didn't mean to offend anyone,the picture has been removed
— Akshay Kumar (@akshaykumar) 24 July 2017
భారత పతాక నిబంధనలను అతిక్రమించి తప్పుచేశాను.. ఎవరిని ఉద్ధేశించి ఇలా చేయలేదు.. దీనికి మనస్పూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నాను.. ఆ ట్వీట్ను తొలిగించాను- అక్షయ్ కుమార్
ఎయిర్ లిఫ్ట్, బేబీ, రుస్తుం లాంటి దేశభక్తి సినిమాలతో ఆకట్టుకున్న ఈ యాక్షన్ హీరో అదే జానర్లో మరో సినిమాలో నటిస్తున్నాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన రీమా కగ్తీస్ జీవిత నేపథ్యంలోని తెరకెక్కిస్తున్న గోల్డ్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూకేలో జరుగుతోంది.