వాళ్లిద్దరికీ ఎనస్థీషియా ఇచ్చి నిద్రపుచ్చా | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరికీ ఎనస్థీషియా ఇచ్చి నిద్రపుచ్చా

Published Tue, Apr 12 2016 2:27 PM

వాళ్లిద్దరికీ ఎనస్థీషియా ఇచ్చి నిద్రపుచ్చా - Sakshi

తనలోని రచయితకు, దర్శకుడికి ఎనస్థీషియా ఇచ్చి నిద్రపుచ్చానని విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. నిర్మాత అశ్వనీదత్, జ్యోతిష్యుడు రమణ మహర్షితో కలిసి మంగళవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసి మీడియాతో పోసాని మాట్లాడారు.

మెంటల్ కృష్ణ తర్వాతి నుంచి తనకు నటుడిగా ఆఫర్లు బాగా వస్తున్నాయని, అందువల్ల ఎక్కువ సమయం నటనకే వెచ్చించాల్సి వస్తోందని అన్నారు. అంతకుముందు రచయితగాను, దర్శకత్వంలో కూడా ఉన్నా.. ఇప్పుడు మాత్రం నటనకే పూర్తిగా అంకితం అయినట్లు చెప్పారు. అందువల్లే తనలో ఉన్న రచయితకు, దర్శకుడికి ఎనస్థీషియా ఇచ్చి నిద్రపుచ్చేశానని అన్నారు.

Advertisement
Advertisement