‘‘సమాజానికి మంచి చేయాలని అందరికీ ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు సేవ చేస్తూనే ఉంటారు. నేను సినిమా వాణ్ణి. సినిమా తప్ప నాకు మరొకటి తెలీదు. అందుకే... సినిమా ద్వారానే సమాజానికి ఉపయోగపడే మంచిని చెబుదామనుకున్నాను. ఆ చిరు ప్రయత్నమే... ‘ఐ యామ్ దట్ ఛేంజ్’’’ అని అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించి, నిర్మించిన లఘు చిత్రం ‘ఐ యామ్ దట్ ఛేంజ్’. గురువారం హైదరాబాద్లో మీడియాకు ఈ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు.
‘‘భవిష్యత్ తరాల కోసం ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగఫలమైన మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ స్పృహను భావితరాలకు అందించాలనే సంకల్పంతో చేసిన లఘు చిత్రమిది. నీతులు చెబితే వినే దశలో నేటి యువత లేరని నాకు తెలుసు. ఎందుకంటే... ఓ బిడ్డకు తండ్రినైనా నేనూ యూతే. ఈ లఘు చిత్రం ద్వారా సమాజానికి సేవ చేయమని నేను చెప్పలేదు. మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తే అదే సమాజ సేవ అవుతుందని చెప్పాను’’ అని అల్లు అర్జున్ చెప్పారు. దర్శకుడు సుకుమార్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ -‘‘రెండ్రోజుల్లో మనం ఓ లఘు చిత్రం చేయనున్నామని సుకుమార్కి చెప్పాను.
అంతే... వెంటనే కాన్సెప్ట్ కూడా ఆయనే తయారు చేసి ఓ బాధ్యతగా చేసిపెట్టారు. ఆయన స్థాయి దర్శకుడు ఇలాంటి లఘు చిత్రం చేయాలంటే పాతిక లక్షలు తీసుకుంటారు. కానీ... పైసా తీసుకోకుండా చేసిపెట్టారు. అలాగే కెమెరామ్యాన్ అమోల్ రాథోడ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీత దర్శకుడు సాయికార్తీక్ - ఇలా అందరూ సహకరించారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ లఘుచిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్కి కృతజ్ఞతలని, ఇలాంటి మంచి లఘు చిత్రానికి దర్శకుణ్ణి అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని సుకుమార్ చెప్పారు.
ఆ సంకల్పంతోనే ఈ లఘు చిత్రం తీశాం
Published Thu, Aug 14 2014 10:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement