నేను మనువాడే వాడు మంచి మనసున్నవాడై ఉండాలి,నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి అంటున్నారు నటి కాజల్అగర్వాల్. ఇప్పటి వరకూ టాలీవుడ్లో వెలిగిన ఈ ఉత్తరాది బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్పై దృష్టి పెట్టారు.తొలుత బొమ్మలాటం చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా పరిచయం చేసిన నటి కాజల్. ఆ తరువాత పళని,నాన్ మహాన్అల్ల,తుపాకీ, జిల్లా తదితర చిత్రాల్లో నటించారు. అయితే తొలి చిత్రం నిరాశ పరచడంతో మదనపడిన ఈ బ్యూటీకి టోలీవుడ్లో చందమామ లాంటి అవకాశం ఆదుకుంది.
ఆపై మగధీర స్టార్డమ్ను అందించడంతో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. అలాగే కోలీవుడ్లో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న కాజల్కు తుపాకీ బాగా పేలింది. వెంటనే విజయ్తో జిల్లా చిత్రంలో లక్కీచాన్స్ రావడంతో హిట్ హీరోయిన్ అయ్యిపోయింది.ప్రస్తుతం కోలీవుడ్పైనే దృష్టి సారిస్తున్న ఈ సుందరి ధనుష్ సరసన మారీ విశాల్కు జంటగా పాయుంపులి చిత్రాల్లో నటిస్తున్నారు.త్వరలో విక్రమ్లో జోడీ కట్టడానికి సిద్ధం అవుతున్న కాజల్ మారీ చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఈ బ్యూటీతో చిన్న భేటీ
ప్రశ్న: మారీ చిత్రంలో నటించిన అనుభవం గురించి?
జవాబు: ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. దనుష్తో నటించడం మంచి అనుభం. అదేవిధంగా దర్శకుడు బాలాజీమోహన్ తో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంది. మారీ జనరంజికమైన కమర్శియల్ చిత్రం.
ప్రశ్న: చిత్రంలో మీ పాత్ర?
జవాబు: ఫ్యాషన్ డిజైనర్గా నటిస్తున్నాను.
ప్రశ్న: తమిళ చిత్రాలలో నటిస్తున్నా తమిళంలో మాట్లాడలేకపోతున్నారే?
జవాబు: ఇప్పుడిప్పుడే తమిళ భాష నేర్చుకుంటున్నాను.
ప్రశ్న: పారితోషికం రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారట?
జవాబు: అందంతా అవాస్తవం. నా అర్హతకు తగ్గ పారితోషికమే పొందుతున్నాను.
ప్రశ్న: హీరోలకు విందు ఇచ్చి అవకాశాలు దక్కించుకుంటున్నారన్న ప్రచారానికి మీ బదులు?
జవాబు: నేనేవరికీ విందులు ఇవ్వలేదు. అదంతా అసత్యప్రచారమే,అయినా అవకాశాల కోసం ఎవరైనా పార్టీలు ఇస్తారా?
ప్రశ్న: మీకు నచ్చిన హీరో?
జవాబు; రజనీకాంత్
ప్రశ్న: మీలాంటి యువ నటి ఐశ్వర్య కాక్కముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ప్రశంసలు అందుకుంటున్నారు. మీరు అలా ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తారా?
జవాబు: అలాంటి పాత్ర లభిస్తే తప్పకుండా నటిస్తా.
ప్రశ్న: ప్రేమ,పెళ్లి గురించి?
జవాబు: ప్రస్తుతం ప్రేమించడానికి సమయం లేదు. ఇక పెళ్లి ఆలోచన ఏం ఉంటుంది?
ప్రశ్న: ఎలాంటి భర్త కావాలని కోరుకుంటారు?
జవాబు: నాకు తెలియదు. ఎందుకంటే అలాంటి వారెవర్నీ నేను కలుసుకోలేదు. అయినా చెప్పాలంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరుకు చెందిన వారైనా పర్వాలేదు. ఎలాంటి నిబంధనలు పెట్టను.అయితే తను నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి. చాలా నిజాయితీగా ఉండాలి.
నన్ను అర్థం చేసుకునేవాడైతే ఓకే
Published Fri, Jun 26 2015 5:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement