నవ్వుకునేవారికి నవ్వుకునేంత... | Sakshi
Sakshi News home page

నవ్వుకునేవారికి నవ్వుకునేంత...

Published Tue, Jun 17 2014 11:00 PM

నవ్వుకునేవారికి నవ్వుకునేంత...

 శివాజీ, నిత్య, లెజ్లీ, కృష్ణుడు, నాగబాబు ముఖ్య తారలుగా పీయస్‌ఆర్ నిర్మించిన చిత్రం ‘చూసినోడికి చూసుకున్నంత’. అనిల్ వాటుపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ పాటలు స్వరపరిచారు. ఈ వారంలో పాటలను, వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని, ప్రేక్షకులకు కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. నవ్వుకోగలిగినవారికి నవ్వుకున్నంత అనే తరహాలో ఈ సినిమా ఉంటుందని, శివాజీ అందించిన సహకారం కూడా మర్చిపోలేమని చెప్పారు.
 

Advertisement
Advertisement