సరైన శిక్ష పడింది | Sakshi
Sakshi News home page

సరైన శిక్ష పడింది

Published Sat, May 6 2017 11:35 PM

సరైన శిక్ష పడింది - Sakshi

‘‘నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పు అందరూ అంగీకరించే విధంగా వచ్చిందని భావిస్తున్నాను. ఈ తీర్పు ఇలాంటి నేరాలకు పాల్పడాలనుకునే వారందరి వెన్నులో వణుకు పుట్టిస్తుంది’’ అని ప్రియాంకా చోప్రా అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ తీర్పు వెలువరించిన సమయంలో ‘నేరస్తుల అమానవీయ ప్రవర్తన మానవత్వాన్ని రూపుమాపేలా ఉంది. ఇంత క్రూరమైన పనిచేసిన నేరస్తులు శాంతికి వ్యతిరేకులు.

సభ్యసమాజాన్ని నాశనం చేసే షాక్‌గా ఈ నేరాన్ని భావిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు పేర్కొనడం అభినందనీయం. ఇలాంటి న్యాయవ్యవస్థ దేశంలో ఉన్నందుకు గర్విస్తున్నాను. సరైన తీర్పుల వల్ల నేరాల సంఖ్య తగ్గుతుంది. నిర్భయ ఘటనలో ఉన్న దోషులకు తగిన శిక్ష పడాలని ఐదు సంవత్సరాల క్రితం ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్‌ చేసిన విషయం సులభంగా మర్చిపోయేది కాదు. ఇలాంటి నేరాలను అడ్డుకోవడానికి దేశప్రజలు ఏకతాటిపై నడవాలి. ఎట్టకేలకు దోషులకు సరైన శిక్ష పడింది’’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement