‘ప్రతిరోజు పండగే’ అంటున్నారు సాయితేజ్. షూటింగ్ కూడా అంతే వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. మారుతి దర్శకత్వంలో సాయితేజ్, రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. ‘బన్నీ’ వాసు నిర్మాత. ఈ చిత్రం రెండో షెడ్యూల్ నేడు హైదరాబాద్లో ప్రారంభం కానుంది. తమిళ నటుడు సత్యరాజ్ ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం.