సాక్షి, హైదరాబాద్ : 'నేనే శైలజ'తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి కీర్తీ సురేశ్. ఆపై చాలా గ్యాప్ తీసుకున్నా ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీబిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఏ మూవీకి కూడా కీర్తి తనకు తాను వాయిస్ ఇచ్చుకోలేదు. కానీ తెలుగులో తొలిసారిగా కీర్తి సురేశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట. ఈ సంతోషాన్ని తన ట్విట్టర్ ఫాలోయర్లతో షేర్ చేసుకుంది.
'తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పేశాను. నా వాయిస్ డబ్బింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు పూర్తి నటిగా ఫీలవుతున్నానంటూ' మూవీ స్టిల్ను చూపిస్తూ అందుకు సంబంధించిన ఓ ఫొటోను నటి కీర్తి ట్వీట్ చేసింది. డబ్బింగ్ థియేటర్ను, మూవీలోని ఓ స్క్రీన్ను మనం ఆ ఫొటోలో చూడొచ్చు. పీఎస్పీకే25, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారికహాసినే పేర్లను హ్యాష్ ట్యాగ్ ఇచ్చి తన ట్వీట్లో తెలుగులో తొలి డబ్బింగ్ అనుభవాన్ని వివరించింది నటి కీర్తి సురేశ్. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10న రిలీజ్ కానుంది.
Dubbing for the first time in Telugu anndddd finished successfully! Now I feel complete!😀
— Keerthy Suresh (@KeerthyOfficial) 26 November 2017
Title from tomorrow 😁
#PSPK25 #TrivikramSrinivas @haarikahassine pic.twitter.com/wetwa00WSo