వేకువజాము వరకూ ఎంజాయ్‌ | Sakshi
Sakshi News home page

వేకువజాము వరకూ ఎంజాయ్‌

Published Mon, Jan 2 2017 1:12 AM

వేకువజాము వరకూ ఎంజాయ్‌

డిసెంబర్‌ 31 వస్తుందంటేనే యువతలో సందడి వాతావరణం ఉరకలేస్తుంది. ఆ రోజు రాత్రిని ఒక మరపురాని విధంగా ఫుల్‌ జోష్‌లో ఎంజాయ్‌ చేయడానికి పిల్లల నుంచి పెద్దల వరకూ సిద్ధం అయిపోతారు. అందుకు ముందుగానే ప్రణాళికలను రెడీ చేసుకుంటారు. గతేడాదికి గుడ్‌బై చెబుతూ, నూతన సంవత్సరానికి వెల్‌కమ్‌ పలికే విధంగా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేస్తారు. ఇక ఆ రాత్రి పబ్‌లు, ఫాం హౌస్‌లు, నక్షత్ర హోటళ్లు అందంగా ముస్తాబై యువత వినోదాలకు వేదికగా నిలుస్తాయి. అదే విధంగా శనివారం కూడా యువత విందులు, వినోదాలతో మునిగి పోయారు. అలాంటి వారి ఎంజాయ్‌మెంట్‌కు పెద్ద నోట్ల రద్దు కూడా అడ్డురాలేదు. నక్షత్ర హోటళ్లలో నీలిరంగు కాంతుల్లో ఆట పాటలతో ఓలలాడి యువత ఫుల్‌ ఖుషీ అయ్యారు.

ఇక నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తన స్నేహితులతో తెల్లవారే వరకూ ఎంజాయ్‌ చేస్తూ గడిపారు. ఆ వీడియోను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. అదిప్పుడు అన్ని వెబ్‌సైట్‌లలో హల్‌చల్‌ చేస్తోంది. వరలక్ష్మీ, నటుడు విశాల్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తోందనే ప్రచారం మొన్నటి వరకూ సాగింది. ఇటీవల వారి ప్రేమకు బ్రేక్‌అప్‌ అయ్యిందనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే అంతకుముందు వరకూ పెద్దగా బహిరంగంగా పార్టీల్లో కనిపించని నటి వరలక్ష్మీ ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. కాగా నటి త్రిష అయితే 30వ తేదీ రాత్రి నుంచే తన స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ యమాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇలాగే మరి కొందరు తారామణులు డిసెంబర్‌ 31 రాత్రిని ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు.

Advertisement
Advertisement