ఫిబ్రవరి 17న రానా ఘాజీ | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 17న రానా ఘాజీ

Published Tue, Jan 10 2017 11:42 AM

ఫిబ్రవరి 17న రానా ఘాజీ - Sakshi

టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ 'ఘాజీ' నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రానా నావెల్ ఆఫీసర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతోంది.

ఇప్పటికే టైటిల్ లోగో పాటు నావెల్ ఆఫీసర్గా రానా లుక్ను రివీల్ చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో పోస్టర్ను రిలీజ్ చేసింది. రానాతో పాటు తాప్సీ, అతుల్ కులకర్ణిలు కనిపిస్తున్న ఈ పోస్టర్లో సబ్ మెరైన్ లోపలి దృశ్యాలను కూడా చూపించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement