'దేవుడే కాపాడలేక పోయాడు' | Sakshi
Sakshi News home page

'దేవుడే కాపాడలేక పోయాడు'

Published Sat, Jul 18 2015 2:53 PM

'దేవుడే కాపాడలేక పోయాడు'

హైదరాబాద్: భగవంతుడు తన భక్తులనే కాపాడలేకపోయినపుడు పాపం సీఎం చంద్రబాబునాయుడు ఎలా కాపాడగలుగుతాడు అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్విట్స్ చేశాడు. పుష్కరాల్లో మరణించిన వారి విషయంలో అందరు చంద్రబాబునాయుడిని నిందిస్తున్నారన్నారు. కానీ భగంతున్ని మాత్రం ఎవరు నిందించడం లేదన్నారు.

పుష్కరాలకు వచ్చిన అమాయక భక్తుల ప్రాణాలను ఎందుకు భగవంతుడు కాపాడలేకపోయాడన్నాడు. ఎందుకంటే బతికున్న మిగతా భక్తుల కంటే మరణించినవారు తక్కవగా దేవున్ని ప్రార్థించారేమో అని తెలిపారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement