ఘనంగా వేవ్ సంబరాలు | Sakshi
Sakshi News home page

ఘనంగా వేవ్ సంబరాలు

Published Mon, Jun 8 2015 9:00 PM

ఘనంగా వేవ్ సంబరాలు

దుబాయి: దుబాయిలో తెలుగువారి ఆత్మీయ వారథి వేవ్ ఎనిమిదో వార్షికోత్సవ సంబరాలు స్థానిక రషీద్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రముఖ నటీ మణులు జయసుధ, రజని, నటుడు నారా రోహిత్, రోహన్ సాయితోపాటు పలువురు పాల్గొన్నారు. తెలుగు యాంకర్ శ్రీవాణి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాధవపెద్ది మూర్తి గారి నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొరియోగ్రాఫర్ జాలీ ఆధ్వర్యంలో పిల్లలతో చేయించిన చేపల నృత్యం కూడా బాగా ఆకర్షించింది.

దాదాపు ఐదుగంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో లంబాడా నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా ప్రతియేటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేవ్ సంస్థ నిర్వాహకులు గీత, రావెళ్ల రమేశ్ బాబుకు జయసుధ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులుగా ఉమా పద్మనాభన్, సునీత, సుధ, త్రివేణి, విశాల, లావణ్య, ప్రశాంతి, మధు శ్రీనివాస్, ప్రసన్న, స్వాప్నిక, దివ్య, మోనిష వ్యవహరించారు.
 

Advertisement
Advertisement