‘‘చాలాకాలం తర్వాత పూర్తి ప్రాఫిట్తో నేను రిలీజ్ చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా యాభై శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది శుభసూచకం’’ అని సి.కల్యాణ్ అన్నారు. హన్సిక ప్రధాన పాత్రధారిణిగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘అరణ్మణై’. ఈ చిత్రాన్ని ‘చంద్రకళ’గా సి. కల్యాణ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. శ్వేతలాన, వరుణ్, తేజ, సి.వి.రావు నిర్మాతలు. నేడు విడుదల కానున్న ఈ సినిమా గురించి సి.కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఇందులో హీరోయిన్ అమ్మవారి భక్తురాలు. ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమ పండే సమయంలో దారుణంగా హత్యకు గురై.. ప్రేతాత్మగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ. ‘అరుంధతి’ని గుర్తు చేస్తుందీ సినిమా’’ అని చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఈ సినిమా విడుదల విషయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ -‘‘లీజు విధానానికి నేను వ్యతిరేకం కాదు. ‘ఆ నలుగురు’, ‘ఆ ముగ్గురు’ అని మాట్లాడటం కూడా సబబు కాదని పలు సందర్భాల్లో చెప్పాను. కానీ... ఇంత పలుకుబడి ఉండి, ఇంత సర్కిల్ ఉన్న నాకే ఈ సినిమా విడుదల చేయడం కష్టమైందంటే.. ఇక చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? లీజు విధానాన్ని చూపిస్తూ మధ్య స్థాయి నిర్మాతల్ని, పంపిణీదారుల్ని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు. ఈ పరిస్థితులే కొనసాగితే ఉద్య మాలు జరుగుతాయి. అది ఎవరికీ మంచిది కాదు. నేను ఛాలెంజ్గా తీసుకొని ఫిష్ వ్యాపారి బాబూరావుతో కలిసి నైజాంలో 125 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నా. మొత్తం మీద 400 థియేటర్లలో సినిమా విడుదలవుతుంది’’ అని చెప్పారు సి.కల్యాణ్.
ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జనరల్ సెక్రటరీగా ఎంపికవడం పట్ల ఆనందాన్ని వెలిబుచ్చుతూ -‘‘దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షునిగా నా సేవలను గుర్తించడం వల్లే నాకు ఈ గౌరవం లభించింది. మన సమస్యలన్నింటినీ పొందుపరచి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి మెమొరాండం ఇవ్వనున్నాం’’ అని తెలిపారు. నాగచైతన్య హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తాను ప్రారంభించిన ‘దుర్గా’ చిత్రం ఆగిపోలేదనీ, త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ మొదలవుతుందనీ, అయితే... దర్శకుడు మారతాడనీ, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా నిర్మిస్తాననీ సి.కల్యాణ్ చెప్పారు. వరుణ్తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఇదే కొనసాగితే ఉద్యమాలే!
Published Thu, Dec 18 2014 11:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రచార హోరు
అన్ని కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఉండాలి
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement