ఫలితం అనుభవించాల్సిందే! | Sakshi
Sakshi News home page

ఫలితం అనుభవించాల్సిందే!

Published Fri, May 30 2014 11:38 PM

ఫలితం అనుభవించాల్సిందే!

రక్తపాత చిత్రాలు తీసే ఓ దర్శకుడు దానికి ఎలాంటి ఫలితాన్ని అనుభవించాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. షఫీ, జోయాఖాన్ ఇందులో ముఖ్యతారలు. రాకేష్ శ్రీనివాస్ దర్శకుడు. సమిష్టి క్రియేషన్స్ పతాకంపై విజయకుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సెటైరికల్ క్రైమ్ కామెడీ సినిమా ఇది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, జూలైలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. శికృష్ణ, జయప్రకాశ్‌రెడ్డి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, నిర్వహణ: సుబ్బారెడ్డి.
 

Advertisement
Advertisement