సాక్షి, కాకినాడ : కాకినాడ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. షూటింగ్లలో ప్రమాదాలు జరగడం సాధారణమని, నటన సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదని తెలిపారు. కాకినాడ ఇతివృత్తంగా రూపొందిస్తోన్న చిత్రం డియర్ కామ్రెడ్, అందుకే ఇక్కడ ఎక్కువ పార్ట్ షూట్ చేశామన్నారు. కాకినాడను ఊహించుకునే దర్శకుడు కథ రూపొందించారు. జగన్నాధపురం బ్రిడ్జ్, బీచ్, మార్కెట్లను సహజంగా చూపించాలని ఇక్కడే షూటింగ్ చేశామని విజయ్ తెలిపారు.
విజయ్ దేవరకొండ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'కాకినాడ, అన్నవరం, రాజమండ్రి, ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సంక్రాంతికి జరిగే కోడి పందాల గురించి విన్నాను. ఎప్పుడు చూడలేదు, అవకాశం ఉంటే ఒకసారి చూసేందుకు ప్రయత్నిస్తాను. పెళ్లి అనేది నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే చేసుకుంటాను. రాజకీయాల కంటే ముందు సినిమాల్లో స్థిరపడాలి' అని పేర్కొన్నారు.‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్తో మంచి హిట్ పెయిర్ అనిపించుకున్న రష్మికా మండన్నా డియర్ కామ్రెడ్లో కథానాయికగా నటిస్తున్నారు. కాకినాడలో షూటింగ్లో భాగంగా కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి విజయ్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
చదవండి : విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం