‘తెలుగు’ కోసం హోమం | Sakshi
Sakshi News home page

‘తెలుగు’ కోసం హోమం

Published Wed, Jan 6 2016 12:07 AM

‘తెలుగు’ కోసం హోమం

తెలుగు భాషా పరిరక్షణ కోసం దర్శక-నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హోమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఆయన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ హోమం చేశారు. ప్రపంచంలోని తెలుగువారందరూ మాతృభాషపై ప్రేమ  పెంపొందించు కోవాలని, తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2006 నిర్బంధ భాషా చట్టం రద్దు కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ హోమంతో అయినా పాలకుల్లో మార్పు రావాలన్నారు. త్వరలో ఈ ఆలయ ప్రాంగణంలో తెలుగుతల్లి విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement