ఫిదా అయిపోయా..! | Sakshi
Sakshi News home page

ఫిదా అయిపోయా..!

Published Mon, May 18 2015 11:47 PM

ఫిదా అయిపోయా..!

 ‘‘నన్ను ప్రతి కుటుంబానికీ పరిచయం చేసిన సినిమా ‘తను వెడ్స్ మను’. ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చెప్పి, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌ని కలవమని హీరో మాధవన్ చెప్పారు. అలా వచ్చిందా అవకాశం. ఇప్పడు ‘తను వెడ్స్ మను’ సీక్వెల్‌లో కూడా చేస్తున్నా. ఈ సినిమా చిత్రీకరణ నా జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ లక్నోలోని రిజ్వి హౌస్‌లో జరిగింది. సినిమాలో ‘తను’ పాత్ర ఉండే ఇంటిగా దీన్ని మార్చేశాం. నేనెప్పుడూ స్ట్రీట్ ఫుడ్స్ తినేదాన్ని కాదు. ఈ సినిమా పుణ్యమా అని అవి కూడా అలవాటైపోయాయి. కాన్పూర్‌లో ‘తుండే కబాబ్స్’ బాగా ఫేమస్. నేను శాకాహారిని కాబట్టి అవేమీ తినడానికి  లేదు. అందుకని చాట్ తిన్నా. అప్పట్నుంచీ స్ట్రీట్ ఫుడ్‌కు బానిసైపోయా. సాయంత్రం అయ్యేసరికి మేం వెళ్లడమో లేక చాట్ పార్శిల్ తెప్పించుకుని తినడమో జరిగేది. లక్నోలోని ‘శుక్లా చాట్ హౌస్’ చాట్‌కు ఫిదా అయిపోయా’’
 - కంగనా రనౌత్
 

Advertisement
Advertisement