‘‘మంచి పాత్రలొస్తేనే చేయాలనుకుంటున్న సమయంలో ఈ కథ విన్నాను. నాకు బాగా నచ్చింది. ఈ టైటిల్ వినగానే స్త్రీలకు నప్పే చిత్రం కాదనుకుంటే పొరపాటే.. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ఇది. మధ్యతరగతి మనస్తత్వాలకు సరిపోయే సినిమా. ఈ చిత్రాన్ని లక్ష్మీకాంత్ చక్కగా చిత్రీకరించారు’’ అన్నారు రోజా.
హిందీ చిత్రం ‘జానీ గద్దర్’ ఆధారంగా రూపొందిన ‘కమీనా’ ఇటీవల విడుదలైప విషయం తెలిసిందే. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో క్రిషి, లేఖా వాషింగ్టన్ నటించిన ఈ చిత్రాన్ని విజయశారద అరిమండ సమర్పణలో వరప్రసాద్రెడ్డి అరిమండ నిర్మించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ చిత్రం సక్సెస్మీట్లో నిర్మాత మాట్లాడుతూ -‘‘కుర్చీల్లోంచి కదలకుండా మరీ ఈ సినిమా చూస్తున్నారు. వసూళ్లు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కుటుంబ నేపథ్యంలో సాగే వినూత్న చిత్రం ఇది’’ అన్నారు.
‘‘ఫ్యామిలీ ఆడియన్స్లో రోజాగారికున్న మంచి ఇమేజ్ని చెడగొట్టకుండా ఆమె పాత్రను మలిచాను. అన్ని ఏరియాల నుంచి సినిమాకి మంచి స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు. ఇంకా క్రిషి, అగస్త్య, జవహర్రెడ్డి తదితరులు చిత్రవిజయంపై తమ ఆనందం వ్యక్తం చేశారు.