ఏమో మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో | Sakshi
Sakshi News home page

ఏమో మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో

Published Sat, Jun 4 2016 5:03 AM

ఏమో   మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో

చక్కని నటి కమలినీ ముఖర్జీ. తెలుగులో ఆనంద్ చిత్రంతో అందరినీ అలరించిన బ్యూటీ ఈమె. బహుభాషా నటిగా గుర్తింపు పొందినా ఎందు చేతనో క్రేజీ నాయకి స్థాయికి చేరుకోలేదు. ఇంతకు ముందు తమిళంలో వేట్టైయాడు విళైయాడు చిత్రంలో కమలహాసన్‌తో రొమాన్స్ చేసిన కమలిని ముఖర్జి.. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఇరైవి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.ఈ సందర్భంగా కమలిని ముఖర్జీ తన అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు.  వేట్టైయాడు విళైయాడు చిత్రంలో కమలహాసన్‌కు జంటగా చిన్న పాత్రనే పోషించినా నాకు తమిళ ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ మరువలేనిది. నేను ఇక్కడ అధిక చిత్రాలు చేయకపోయినా ఇంకా గుర్తు పెట్టుకున్నారు.

అలాంటి వైవిధ్యభరిత పాత్రల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇరైవి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో కుటుంబం, ఉద్యోగం రెండింటిని మేనేజ్ చేసుకుంటూ జీవించే పాత్ర. ఇప్పటి వరకూ నేను నటించిన పాత్రలకు భిన్నమైనది. ఈ పాత్రతో మరోసారి తమిళ ప్రేక్షకులకు దగ్గరవుతాననే నమ్మకం ఉంది. భాష నాకు సమస్య కాదు. నాకు నచ్చిన హీరో ఎవరని అడుగుతున్నారు. నటనకే నేను అభిమానిని. తదుపరి చిత్రం ఏమిటన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రస్తుతం మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను. ఇక రచన,ప్రయాణం, పాకశాస్త్రం కళలపై ఆసక్తి చూపుతున్నాను. భవిష్యత్‌లో పలు కథలు రాస్తాను. నేను రంగస్థలంపై నటించాను. ఏమో మళ్లీ స్టేజీ ఎక్కవచ్చునేమో.

Advertisement
Advertisement