మణిరత్నం దర్శకత్వంలో! | Sakshi
Sakshi News home page

మణిరత్నం దర్శకత్వంలో!

Published Sat, Sep 9 2017 12:25 AM

మణిరత్నం దర్శకత్వంలో! - Sakshi

దర్శకుడు మణిరత్నంతో ఒక్కసారైనా పని చేయాలనుకునే నటీనటులు ఎందరో? వాళ్లలో జ్యోతిక కూడా ఒకరు. పదిహేనేళ్ల క్రితమే మణిరత్నంతో పనిచేసే ఛాన్స్‌ జ్యోతికకు వచ్చింది. ఆమె దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అదే ‘డుమ్‌ డుమ్‌ డుమ్‌’... మాధవన్, జ్యోతిక జంటగా నటించిన తమిళ సినిమా. 2001లో వచ్చింది. అయితే... ఆ సినిమాకు మణిరత్నం దర్శకుడు కాదు. కథా రచయిత–నిర్మాత మాత్రమే.

ఆయన శిష్యుడు అళగం పెరుమాళ్‌ దర్శకత్వం వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు మణిరత్నంతో పని చేసే ఛాన్స్‌ వచ్చింది. ఈసారి ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్సే! సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆచితూచి సిన్మాలు చేస్తోన్న జ్యోతిక వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ‘‘బాలా దర్శకత్వంలో నటిస్తున్న ‘నాచియార్‌’ తర్వాత మణిరత్నంగారి దర్శకత్వంలో నటించబోతున్నా. ఈ సినిమా అనౌన్స్‌ చేయడానికి మణి సార్‌ దగ్గర అనుమతి తీసుకున్నా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ చెప్పలేను’’ అన్నారు జోతిక. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందట.

Advertisement

తప్పక చదవండి

Advertisement