సరికొత్త అవతారం | Sakshi
Sakshi News home page

సరికొత్త అవతారం

Published Tue, Nov 12 2013 1:12 AM

సరికొత్త అవతారం

భక్తిరసాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో కోడిరామకృష్ణది ఓ ప్రత్యేక శైలి. అమ్మోరు, దేవుళ్లు, త్రినేత్రం... చిత్రాలే అందుకు నిదర్శనాలు. త్వరలో ఆయన నిర్దేశకత్వంలో రాబోతున్న మరో డివోషనల్ మూవీ ‘అవతారం’. ఎం.యుగంధర్‌రెడ్డి నిర్మాత. కన్నడ నటి రాధిక ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ సినిమా గురించి కోడి రామకృష్ణ మాట్లాడుతూ -‘‘సెంటిమెంట్‌కీ దుష్టశక్తికీ మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథ. త్వరలో ఓ గ్రహం భూమిని ఢీకొట్టబోతోందన్న భయం ప్రజానీకానికి ఉంది. దానికి ప్రీ క్లైమాక్స్‌గా తీసుకొని అల్లిన కథే ‘అవతారం’. నన్ను కూడా ఎంతో ఇన్‌స్పైర్ చేసిన కథ ఇది. ఇందులో గ్రాఫిక్స్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంది. సినిమా సరికొత్త రీతిలో ఉంటుంది’’ అని తెలిపారు. రిషి కథానాయకునిగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీవెంకట్, సంగీతం: ఘంటాడి కృష్ణ, నిర్మాణ సహకారం: ఎన్.సతీష్‌కుమార్‌రెడ్డి, సమర్పణ: ఎం.కవిత.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement