తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన తెలుగు సినీ ఆణిముత్యం ‘మా భూమి’ అని పలువురు సినీ ప్రముఖులు, మేధావులు మరొక్కసారి గుర్తు చేసుకున్నారు. ‘మా భూమి’ చిత్రం విడుదలై (1980 మార్చి, 23) సోమవారంతో 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ చిత్రంలో పాల్గొన్న నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ఆదివారం హైదరాబాద్లో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్రనిర్మాతల్లో ఒకరైన బి. నరసింగరావు మాట్లాడుతూ... ‘మా భూమి’ చిత్రనిర్మాణానికి ఆ రోజుల్లో తాము పడిన కష్టనష్టాలను, చిత్రప్రదర్శనకు రాజ్యవ్యవస్థ నుంచి ఎదురైన నిర్భంధాలను గుర్తు చేశారు.
చాలా ఏళ్లుగా అందుబాటులో లేని ఈ చిత్రాన్ని పాతిక లక్షల రూపాయల ఖర్చుతో డిజిటలైజ్ చేశామనీ, అది మరో పది రోజుల్లో బ్లూ రే డీవీడీ రూపంలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ‘‘సమాజం కోసం 40 ఏళ్ల క్రితం ప్రజా కళాకారులుగా మేం చేసిన పనిని ఇప్పటి యువతరం అందుకుని బాధ్యతలు చేపట్టాలి. అందుకు మేము అన్ని విధాలా అండదండగా ఉంటాం’’ అని కూడా బి. నరసింగరావు చెప్పారు. ‘‘ఇది ప్రజల సినిమా. కేవలం ఆంధ్రా సినిమానో.. తెలంగాణా సినిమాని కాదు’’ అని చిత్రనిర్మాతల్లో మరొకరైన జి. రవీంద్రనాథ్ (అమెరికా) అన్నారు.
ఈ కార్యక్రమంలో ‘మా భూమి’ చిత్రంలో నటించిన సాయిచంద్, సీనియర్ నటుడు కాకరాల, భూపాల్రెడ్డి. గాయని సంధ్య తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ రాజకీయ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. చిత్రబృందానికి జ్ఞాపికలు అందించడం విశేషం. సోమవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు మా టీవీలో ‘మా భూమి’ని ప్రసారం చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. సభానంతరం కిక్కిరిసిన జనాల మధ్య ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
ఇది ప్రజల సినిమా
Published Sun, Mar 22 2015 11:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement