సైకలాజికల్ థ్రిల్లర్ 1.. నేకొక్కడినే సినిమా తీసిన సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి సరదాగా ఉన్నాడు. ఈ సినిమా గురించి రివ్యూలలో రకరకాలుగా ఇచ్చినా, ఓపెనింగులు మాత్రం అద్భుతంగా ఉన్నాయని, అందువల్ల తర్వాతి సినిమా కూడా సుకుమార్తోనే కలిసి చేస్తానని మహేష్ అంటున్నాడు. ''తర్వాతి సినిమా మీద ఎప్పుడు కూర్చుందామంటూ మహేష్ ఎస్ఎంఎస్ ఇచ్చాడు. తనకు నాతో కలిసి చేయడం నచ్చినందుకు చాలా సంతోషం. నేను కూడా మళ్లీ తనతో సినిమా చేద్దామనుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి నా దగ్గర స్క్రిప్టు సిద్ధంగా లేదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా'' అని సుకుమార్ తెలిపాడు. మరోవైపు ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వంలోని 'ఆగడు' చిత్రంలో మహేష్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇంతకుముందు శ్రీనువైట్లతో కలిసి 'దూకుడు' లాంటి సక్సెస్ఫుల్ చిత్రంలో మహేష్ నటించాడు.
ఇప్పటివరకు తాను నటించిన ఉత్తమ చిత్రాలన్నింటిలోకీ 1.. నేనొక్కడినే సినిమా అగ్రస్థానంలో ఉంటుందని, అదెప్పటికీ నెంబర్ 1 చిత్రమేనని మహేశ్ బాబు అంటున్నాడు. ఈ చిత్రంపై ఆయన ట్విట్టర్లో తన వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు. ''1 చిత్రం ఎప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయే సినిమాల్లో నెంబర్ 1 గానే ఉండిపోతుంది. దర్శకుడు సుకుమార్తో పాటు మొత్తం 1 బృందం అంతటికీ తలవంచి నమస్కరిస్తున్నా'' అని ఒక ట్వీట్ పెట్టాడు. దాంతో పాటు, 1 చిత్ర ప్రయాణంలో తనకు తోడుగా ఉన్న అందరికీ తన ప్రేమను పంచుతూ మరో ట్వీట్ కూడా పెట్టాడు. అందరూ తనకు మద్దతిచ్చినందుకు గర్వపడుతున్నానని అందులో అన్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో కృతి సనన్, నాజర్, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ, విక్రమ్ సింగ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలలో నటించారు.
1 will remain as 1 of the most memorable films I've ever done.Take a bow sukumar & the entire team of 1.
— Mahesh Babu (@urstrulyMahesh) January 13, 2014
For all those guys who have supported me on this 1 journey , love you forever. Proud.
— Mahesh Babu (@urstrulyMahesh) January 13, 2014