మంచు వారింట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మంచు విష్ణు సతీమణి విరానికా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో భార్య విరానికాతో పాటు పిల్లలు వివియానా, ఆరియానా, అవ్రమ్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా మంచు విష్ణు ఓటర్ చిత్రంలో ప్రేక్షకులను పలకరించారు.