సెన్సార్ పూర్తి చేసుకున్న మణిరత్నం 'చెలియా' | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకున్న మణిరత్నం 'చెలియా'

Published Sat, Mar 25 2017 3:13 PM

సెన్సార్ పూర్తి చేసుకున్న మణిరత్నం 'చెలియా'

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన సినిమా చెలియా. మణి మార్క్ టేకింగ్తో విజువల్ ఫీస్ట్గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ్తో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మణిరత్నం తన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ను కూడా పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ను జారీ చేశారు. కార్తీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నటిస్తుండగా అదిథి రావు హీరోగా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే సూపర్ హిట్ కాగా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement