మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో నయన | Sakshi
Sakshi News home page

మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో నయన

Published Fri, Sep 15 2017 3:45 AM

మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో నయన

తమిళసినిమా: నటి నయనతార మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. మాయ చిత్రంతో నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్న నటి నయనతార. అప్పటి వరకూ కమర్శియల్‌ చిత్రాల నాయకిగా రాణించిన ఈ సంచలన నటి మాయ చిత్రంతో చిత్ర కథను తన భుజాన వేసుకుని విజయ తీరానికి చేర్చే స్థాయికి చేరారు.

ఆ తరువాత నటించిన డోరా చిత్రం నిరాశపరచినా, నయనతారకు దాని ఎఫెక్ట్‌ ఏమాత్రం పడలేదు. ప్రేమ వివాదాల్లో ఒడుదుడుకులను ఎలాగైతే వాటిని అధిగమించారో, నటిగానూ అపజయాలను దాటి విజయాల బాట పట్టారు. ప్రస్తుతం అరమ్, కొలైయుధీర్‌ కాలం, ఇమైకా నోడిగళ్, నేర్‌వళి వంటి హీరోయిన్‌ఓరియెంటెడ్‌ చిత్రాలతో పాటు మరోపక్క హీరోలతో కమర్షియల్‌ చిత్రాలను నటిస్తూ తెగ బిజీగా ఉన్నారు.

ఈ శుక్రవారం శివకార్తికేయన్‌తో జత కట్టిన వేలైక్కారన్‌ చిత్రం విడుదల కావలసి ఉన్నా, నిర్మాణ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో ఆ చిత్రం వెనక్కు వెళ్లింది. అయితే త్వరలో ఇమైకా నోడిగళ్, ఆరమ్‌ చిత్రాలు తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఇకపోతే తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న నయనతార తాజాగా మరో హీరోయిన్‌ సెంట్రిక్‌ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.

కుట్రం 23 వంటి క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన అరివళగన్‌ దర్శకత్వంలో నయనతార నటించనున్నారన్నది తాజా సమాచారం. ఇందులో సీనియర్‌ నటుడు రాజ్‌కిరణ్‌ ప్రధాన పాత్రను పోషించనున్నారట. ఈ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిసింది. అయితే చిత్ర వివరాలను త్వరలోనే అధికారికపూర్వకంగా చిత్ర యూనిట్‌ వెల్లడించే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు.

Advertisement
Advertisement