సినిమా తీస్తానంటున్న నయన? | Sakshi
Sakshi News home page

సినిమా తీస్తానంటున్న నయన?

Published Thu, Apr 28 2016 2:51 AM

సినిమా తీస్తానంటున్న నయన? - Sakshi

ఇటీవల కథానాయికలు చిత్ర నిర్మాణంపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు.ఇప్పటికే నటి అమలాపాల్, విజయలక్ష్మి లాంటి నటీమణులు నిర్మాతలుగా అవతారమెత్తారు. ఇక చెన్నై చిన్నది సమంత కూడా చిత్ర తీయడానికి ఒక మలయాళ చిత్రం రీమేక్ హక్కులను పొందినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అగ్రనాయకి నయనతార తాను సైతం నిర్మాత నైతానంటున్నారని సమాచారం. ఇప్పటి వరకూ తెరపై ఆడి పాడి, తన అందాలతో, అభినయంతో అలరించిన ఈ క్రేజీ భామ నటిగా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.
 
 మాజీ ప్రియుడు శింబుతో రొమాన్స్ చేసిన ఇదునమ్మఆళు చిత్రం, జీవాకు జంటగా నటించిన తిరునాళ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతున్నాయి. ప్రస్తుతం కార్తీ సరసన కాష్మోరా, విక్రమ్‌తో ఇరుముగన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవిగాక త్వరలో మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో నటించడానికి సిద్ధమవుతున్నారు.
 
 శివకార్తికేయన్‌తో జత కట్టనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. మరో విషయం ఏమిటంటే ఆ వెంటనే ఆయనతో మరో చిత్రం చేయడానికి నయనతార రెడీ అవుతున్నారన కోలీవుడ్ టాక్. దీనికి ఆమె తాజా ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం హల్‌చల్ చేస్తోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి నయనే నిర్మాత కానున్నారనే ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ చిత్రం మేలో ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement