వారి కుట్రలు నాపై సాగవు! | Sakshi
Sakshi News home page

వారి కుట్రలు నాపై సాగవు!

Published Sat, Jul 15 2017 1:14 AM

వారి కుట్రలు నాపై సాగవు! - Sakshi

తమిళసినిమా: నాపై కుట్రలు పన్నుతున్నారు. అయితే అవి నన్నేమి చేయలేవు. నా స్థాయిని ఎవరూ కుదించలేరు అంటోంది నటి కాజల్‌ అగర్వాల్‌. ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్, అజిత్‌ వంటి ఇద్దరు స్టార్‌ హీరోలతో నటిస్తున్న ఏకైక హీరోయిన్‌ కాజల్‌అగర్వాలే. అదేవిధంగా తెలుగుతో పాటు హిందీలోనూ అవకాశాలను అందుకుంటున్న నటి కాజల్‌. తెలుగులో రానాతో రొమాన్స్‌ చేసిన నేనేరాజా నేనేమంత్రి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇక హిందీలో సన్నిడియోల్‌తో నటించే లక్కీచాన్స్‌ ఈ బ్యూటీని వరించిదనే ప్రచారం జరుగుతోంది. తాజాగా పి.వాసు దర్శకత్వంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం చేయనున్నట్లు టాక్‌ ప్రచారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్‌అగర్వాల్‌పై వదంతులు జోరుగానే సాగుతున్నాయన్నది గమనార్హం. ఆ మధ్య ఒక భేటీలో తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని, తనకు కాబోయే వరుడు సినిమారంగానికి చెందిన వాడైనా, లేదా మరే ఇతర రంగాలకు చెందిన వాడైనా పర్వాలేదని, తను అందంగా లేకపోయినా పర్వాలేదు గానీ కచ్చితంగా ఆరడుగుల పొడగాటి వాడై ఉండాలని పేర్కొన్నారు.

దీంతో కాజల్‌ ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరందుకుంది. ఒక ప్రముఖ టాలీవుడ్‌ నటుడితో తరచూ రహస్యగా కలుసుకుంటున్నారని, అదే విధంగా ఇటీవల అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఇలాంటివి కాజల్‌ను కలతకు గురిచేశాయట. దీంతో ఈ అమ్మడు కాస్త ఘాటుగానే స్పందించారు.తన ఎదుగుదలను ఓర్వలేని వారే ఇలాంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు.ఇదంతా వారు తనపై పన్నుతున్న కుట్ర అని ఆరోపించారు. అయితే వారి కుట్రలు పారవని, మరి కొన్నేళ్ల వరకూ తాను అగ్రహీరోలతోనే నటిస్తానని కాజల్‌అగర్వాల్‌ అన్నారు. తన స్థానాన్ని ఎవరూ కదిలించలేరు అనే ధీమాను వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement