Sakshi News home page

కరెంటుతీగతో ఎన్టీఆర్ రొమాన్స్!

Published Tue, Jan 6 2015 6:25 PM

కరెంటుతీగతో ఎన్టీఆర్ రొమాన్స్! - Sakshi

టాలీవుడ్లో లక్కీగాళ్గా పేరుతెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో రొమాన్స్ చేయబోతోంది. ప్రస్తుతం ఒకవైపు రవితేజ, మరోవైపు రామ్లతో సినిమాలు చేస్తున్న ఈ సుందరి.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఎంపికైంది. ఈ విషయం తెలియగానే ఆమె ఎగిరి గంతేసి మరీ ఒప్పుకొన్నట్లు సమాచారం.

ఇప్పటివరకు ఎన్టీఆర్ సరసన చాలామంది హీరోయిన్లు చేసేశారు. దాంతో ఈసారి ఇప్పటివరకు అసలు చేయని, అందమైన హీరోయిన్ కోసం సుకుమార్ వెతికారని, సరిగ్గా అలాంటి కోవలోకి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరిందని ఈ సినిమా వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో హీరోయిన్కు కూడా మంచి నటనకు అవకాశం ఉండటంతో ఆమెకు ఇది మంచి చాన్సు అవుతుందంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న టెంపర్ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు రకుల్ ప్రీత్ రవితేజ సరసన వస్తున్న కిక్-2లో నటిస్తోంది. వాళ్లిద్దరికి చేతిలో ఉన్న సినిమాలు అయిపోగానే సుకుమార్ సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు.

Advertisement
Advertisement