వచ్చే వారాంతంలో బాలీవుడ్ తెరపై అక్క చెల్లెళ్ల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రియాంక చోప్రా, ఆమె చెల్లెలు పరిణితి చోప్రాలు నటించిన సినిమాలు సెప్టెంబర్ 6న విడుదల కానున్నాయి. ప్రియాంక చోప్రా నటించిన జంజీర్, పరిణితి చోప్రా నటించిన 'శుద్ద్ దేశి రొమాన్స్' చిత్రాలు ఒకే రోజు బాలీవుడ్ లో రిలీజ్ కానున్నాయి.
పరిణిత నా సోదరి. తమ కుటుంబంలోని వ్యక్తి. మా ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదల కావడాన్ని వివాదస్పదం చేస్తే ఎలా అని ప్రియాంక ప్రశ్నించింది. మా ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదల అయ్యే అంశాపై వివాదం సృష్టించడం చవకబారు ప్రచారం అని ప్రియాంక వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా వచ్చేవారం 'చోప్రా వీకెండ్' అని.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ప్రియాంక తెలిపింది.
ఇటీవల కాలంలో ఇద్దరు అగ్రనటుల చిత్రాలు ఒకే రోజున విడుదలైన నేపథ్యంలో మీడియా వివాదస్పదం చేయడాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.