అవినీతి, అక్రమాలను సాగించే సంఘ విద్రోహ శక్తులపై ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి పోరాటం సాగించిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో సాజిద్ ఖురేషీ దర్శకత్వంలో ఎం.ఎస్. యూసఫ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిషా మాట్లాడుతూ- ‘‘నీతీ, నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నా. సరికొత్త కథాకథనాలతో దర్శకుడు సాజిద్ ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నింటి కన్నా ఈ ‘బుల్లెట్ రాణి’ నాకెంతో ప్రత్యేకం.
సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. సాజిద్ ఖురేషీ మాట్లాడుతూ - ‘‘టైటిల్ రోల్కు న్యాయం చేయడానికి నిషా రెండు నెలల పాటు కసరత్తులు చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం నిర్మించాం. ఇటీవల రషెస్ చూసుకుంటే చాలా సంతృప్తి అనిపించింది. నవంబర్ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
Related news
-
Eksha Hangma Subba: సూపర్ ఉమన్!
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు విమానాలను కూడా అవలీలగా నడిపేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నైపుణ్యంతో రాణిస్తూంటే ‘ఇక్షా హంగ్మా సుబ్బ’ మాత్రం నాలుగు నైపుణ్యాలతో వందమందిలో ఒక్కటిగా దూసుకుపోతుంది. ఇక్షా హంగ్మా సుబ్బ.. ఏంటీ అనిపిస్తుంది కదూ! అవును ఈ పేరు పలకడానికి, వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నట్టుగానే ఇక్షా వృత్తినైపుణ్యాలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోయినప్పటికీ, తనదైన శైలిలో రాణిస్తూ అందరిచేత సూపర్ ఉమన్ అనిపిస్తోంది. బోల్డ్ అండ్ బ్యూటిపుల్గా పేరొందిన ఇక్షా.. సిక్కిం పోలీస్ ఆఫీసర్, జాతీయ స్థాయి బాక్సర్, బైకర్, ఎమ్టీవీ సూపర్ మోడల్. సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ జిల్లా సొంబారియా గ్రామంలో ఐతరాజ్, సుకర్ణి సుబ్బా దంపతులకు 2000 సంవత్సరంలో ఇక్షా జన్మిచింది. ఒక సోదరుడు ఉన్నాడు. ప్రైమరీ,సెకండరీ విద్యాభ్యాసం అంతా సొంతూరులోనే పూర్తి చేసింది. తరువాత గ్యాంగ్టక్లోని బహదూర్ భండారీ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఈ సమయం లోనే ఎన్ఎస్ఎస్లోలో చేరింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే ఇక్షాకు నటన అన్నా... మోడలింగ్ అన్నా అమితాసక్తి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా డిగ్రీ చదువుతూనే పోలీసు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో సిక్కిం పోలీస్ విభాగంలో చేరింది. 14 నెలల శిక్షణ తరువాత ‘యాంటీ రైట్ ఫోర్స్’ విభాగంలో పోలీస్ ఆధికారిగా చేరింది. ఉద్యోగంలో చేరి, కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ చిన్నప్పటినుంచి ఉన్న మోడలింగ్ ఆసక్తి వెలితిగా తోచింది తనకు. మిస్ సిక్కిం.. పోలీస్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు వివిధ మోడలింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లలో పాల్గొని గెలిచిన సందర్భాలు, కాలేజీలో ‘మిస్ ఫ్రెషర్’గా టైటిల్ను గెలుచుకున్న సందర్భాలు తనకి గుర్తొచ్చేవి. తన గ్రామం నుంచి రాష్ట్రస్థాయి మోడలింగ్ పోటీలలో పాల్గొని మిస్ సిక్కిం టైటిల్ను గెలుచుకుంది. దీంతో ఇక్షాకు మోడలింగ్లోకి వెళ్లేందుకు నమ్మకం కుదిరింది. అక్కడి నుంచి వివిధ రకాల మోడలింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఎమ్టీవీ సూపర్ మోడల్ –2 రియాల్టీ షో ఆడిషన్స్కు హాజరై సెలక్ట్ అయింది. ఈ సెలక్షన్స్ ద్వారా ఇక్షా గురించి అందరికీ తెలిసింది. మొత్తం పదిహేనుమంది పాల్గొన్న ఈ షోలో మొదట టాప్ నైన్లో చోటు సంపాదించుకుని పాపులర్ అయ్యింది. పోటాపోటీగా జరుగుతున్న ఈ షోలో ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతూ అందర్ని ఆకట్టుకుంటోంది. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సూపర్ మోడల్గా ఇక్షాను పొగుడుతూ ట్వీట్ చేయడం, షో న్యాయనిర్ణేతలు కూడా ఇక్షాను అభినందిస్తుండంతో అంతా ఆమెను అభినందనలలో ముంచెత్తుతున్నారు. ఇక్షా ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శారీరకంగా ఫిట్గా ఉండేందుకు ఆటలు బాగా పనికొస్తాయని ప్రోత్సహించడంతో స్థానికంగా నిర్వహించే బాక్సింగ్ తరగతులకు హాజరై బాక్సింగ్ నేర్చుకుని జాతీయస్థాయి బాక్సర్గా ఎదిగింది. అలా ఒకపక్క బాక్సింగ్ చేస్తూనే మరోపక్క ఉద్యోగం చేస్తూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ సూపర్ ఉమన్గా నిలుస్తోంది. ఇక్షాకు మోడలింగ్తోపాటు డ్రైవింగ్ కూడా చాలా ఇష్టం. అందుకే ఆమె కేటీఎమ్ ఆర్సీ 200 మోటర్ బైక్ నడుపుతూ లాంగ్ రైడ్స్కు వెళ్తుంటుంది. చిన్న వయసులో ఇన్ని రకాల నైపుణ్యాలతో దూసుకుపోతూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది ఇక్షా. -
DSP Shilpa Sahu; ‘అమ్మ’ఆన్ డ్యూటీ
అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి కదలవద్దని జనానికి చెప్పడానికి.. ఇంట్లో ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ బయటికి వచ్చి ఎర్రటి ఎండలో డ్యూటీ చేస్తున్నారు ఐదు నెలల గర్భిణీ అయిన దంతెవాడ డీఎస్పీ శిల్పా సాహూ!! ‘సురక్షితంగా ఉండండి, మాస్కులు ధరించండి’ అని చెప్పడానికి, నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని హెచ్చరించడానికి లాఠీ చేతపట్టి.. తన కడుపులోని బిడ్డకు ప్రమాదమేమో అని కూడా తలవకుండా కరోనా సెకండ్ వేవ్ లో, సూర్యుడి భగభగల్లో, మావోయిస్టుల కదలికల నడుమ.. ఆమె తన విధులు నిర్వహిస్తున్నారు! ఎప్పుడూ గుడిలో దర్శనమిచ్చే దంతేశ్వరీ దేవి మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దంతెవాడ పట్టణ ప్రధాన కూడళ్లలో కర్ర పట్టి తిరుగుతూ, ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు చెబుతూ ఉన్నట్లే అనిపించి ఉండవచ్చు అక్కడి వారికి కొందరికైనా! ఆ ‘దంతేశ్వరీ దేవి’ పేరు శిల్పా సాహూ (29). దంతెవాడ డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్. దంతెవాడ చత్తీస్గఢ్ జిల్లాలో ఉంది. సాధారణంగా మావోయిస్టులను గుర్తుకు తెచ్చే ఈ ప్రాంతం.. కరోనా లాక్డౌన్ విధుల నిర్వహణలో డీఎస్పీ శిల్పా సాహూ చూపిన అంకితభావం కారణంగా ఎవరికైనా శక్తిమాతను గుర్తు తెచ్చి ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని మొత్తం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటైన దంతేశ్వరీదేవి ఆలయం దంతెవాడలో ఉంది. ఆ తల్లి తన బిడ్డల్ని అదిలించి, కదిలించి, సంరక్షించిన విధంగానే ఇప్పుడు శిల్ప తన పౌరుల్ని కరోనా నిర్లక్ష్యం నుంచి అదిలిస్తూ, త్వరగా చేరమని ఇళ్లకు కదిలించే డ్యూటీలో ఉన్నారు. నిజానికైతే ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితే. గాలి సోకితే చాలు కరోనా వచ్చేలా ఉంది. ఎండ ఆవిర్లు వదులుతోంది. మావోయిస్టులు ఎక్కడ మాటువేసి ఎటుగా వస్తోరో తెలియదు. అయినా పోలీస్ డ్యూటీ పోలీస్ డ్యూటీనే. అన్నిటినీ తట్టుకోవాలి. పౌరుల్ని కాపాడాలి. డిఎస్పీ శిల్ప కూడా అదే డ్యూటీ ఉన్నారు కానీ, ఆమె కాస్త ప్రత్యేకమైన పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. ఐదవ నెల గర్భిణి ఆమె. ఇక నుంచి ఆమె మరింతగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆమెకు చెప్పే ఉంటారు. అయితే సెకండ్ వేవ్ కరోనాలో ప్రజలు మరింతగా భద్రంగా ఉండాలని చెప్పడం కోసం ఆమె బయటికి వచ్చారు. లాఠీ పట్టుకుని దంతెవాడ ప్రధాన రహదారులలో డ్యూటీ చేశారు. మాస్క్ వేసుకోని వాళ్లను, అనవసరంగా బయటికి వచ్చినవాళ్లను ఆపి, మందలించారు. కరోనా బారిన పడకుండా, ఇతరులను పడేయకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పి పంపారు. సాటి మానవులు చెబితే కోపం వస్తుందేమో కానీ, డీఎస్పీ చెబితే వినకుండా ఉంటారా? ఇప్పుడామె చేస్తున్నది బాధ్యతల్ని గుర్తు చేసే డ్యూటీ. ఒకరు గుర్తు చేయాల్సినంతగా నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రదర్శిస్తున్న పౌరులు.. గర్భిణిగా ఉండి కూడా మిట్ట మధ్యాహ్నపు ఎండలో డ్యూటీ చేయడం చూసి సిగ్గుపడే ఉంటారు. తనకు, కడుపులో ఉన్న తన బిడ్డకు కరోనా సోకుతుందేమోనన్న భయం లేకుండా శిల్ప పౌరుల క్షేమం కోసం పాటు పడటం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్నే పెంచింది. గర్భంతో ఉండి కూడా ఆమె డ్యూటీ చేస్తున్నప్పటి ఫొటోను ఐపీఎస్ ఆఫీసర్, చత్తీస్గఢ్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దీపాంశు కబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయగానే ‘డ్యూటీ మైండెడ్’ శిల్పపై గత 48 గంటలుగా ట్విట్టర్లో ధారాపాతంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ‘సెల్యూట్ టు డీఎస్పీ శిల్పా సాహూజీ! డీజీపీ శ్రీ అవస్థిగారూ.. ఆమెకు అవార్డు ప్రకటించంది. అలాగే ఆమె కోరుకుంటే కనుక ఆమెను రాయ్పుర్ బదలీ చేయండి’ అని ఒకరు, ‘గుడ్ జాబ్ మేమ్, ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ’ అని ఇంకొకరు.. పదులు, వందల్లో ఆమెను అభినందిస్తూ, జాగ్రత్తలు చెబుతున్నారు. రాయ్పుర్ చత్తీస్గఢ్ రాజధాని. అక్కడికి, దంతెవాడకు ఏడున్నర గంటల ప్రయాణం. రాయ్పుర్లో అయితే శిల్పకు ఈ సమయంలో సౌకర్యంగా ఉంటుందని కూడా ట్విటిజెన్లు ఆలోచిస్తున్నారు. సీఎం ఆమెను ఒక ఆదర్శ మహిళా అధికారిగా కీర్తించారు. ఇంతకంటే కఠిమైన డ్యూటీలనే చేశారు శిల్పి. ఎ.కె.47 ధరించి ‘ఆపరేషన్’లలో పాల్గొన్నారు. దంతేవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘దంతేశ్వరి ఫైటర్స్’ (మహిళా కమాండోలు) కు నాయకత్వం వహించారు. వాటికంటే కష్టమైన పని.. కరోనా లాక్డౌన్ నిబంధనల్ని జనం ఉల్లంఘించకుండా చూడటం అని ఇప్పుడామె గ్రహించే ఉంటారు. ‘‘నేను బయట ఉంటేనే.. వాళ్ల లోపల ఉంటారు’’ రోడ్డు మీద వెళుతూ అధాటున చూసిన వారికి మామూలు దుస్తుల్లో ఉన్న శిల్పా సాహు మొదట సాధారణ మహిళగా అనిపించవచ్చు. కానీ, గర్జించే ఆమె స్వరం.. ఆమె పోలీసు అన్న వాస్తవాన్ని ఆ వెంటనే తెలియజేస్తుంది. ‘వాపస్ జావో, ఘర్ జావో’ (వెనక్కు వెళ్లు.. ఇంటికి వెళ్లు) అని గట్టిగా అరచి చెప్పినా వినని వారికి ఆమె చేతిలోని లాఠీ చక్కగా అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్ధమౌతుంది. ఏప్రిల్ 18 నుంచి దంతెవాడ జిల్లా (దక్షిణ బస్తర్) లాక్డౌన్లో ఉంది. ఆ రోజు నుంచీ శిల్ప లాక్డౌన్ డ్యూటీలో ఉన్నారు. ‘‘గర్భిణిగా ఉండి మీరు బయటికి రావడం ఎందుకు?’’ అనే ప్రశ్నకు.. ‘‘నేను బయట ఉంటేనే వాళ్లు లోపల ఉంటారు’’ అంటున్నారు శిల్ప. -
మహిళా పోలీస్తో జడేజా వాగ్వాదం
రాజ్కోట్: భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి రివాబా వివాదంలో చిక్కుకున్నారు. ‘మాస్క్ పెట్టుకోలేదు... జరిమానా చెల్లించండి’ అని ప్రశ్నించిన మహిళా కానిస్టేబుల్తో వీరు వాగ్వాదానికి దిగారని సమాచారం. ప్రాథమిక సమాచారం మేరకు గుజరాత్లోని రాజ్కోట్లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జడేజా తన భార్య రివాబాతో కలిసి రాత్రి 9 గంటల ప్రాంతంలో కారులో వెళ్తుండగా... మహిళా కానిస్టేబుల్ సోనాల్ గొసాయ్ వీరిని కిసాన్పరా చౌక్ దగ్గర ఆపింది. ఆ సమయంలో జడేజా మాస్క్ను ధరించి ఉన్నా... అతడి భార్య వేసుకోకపోవడంతో... జరిమానా చెల్లించాల్సిందిగా జడేజాను కోరింది. ఈ విషయంపై జడేజాకు, కానిస్టేబుల్కు మధ్య వాదన పెరిగి తీవ్రంగా దూషించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాజ్కోట్ డీసీపీ మనోహర్ సింగ్ జడేజా స్పందించారు. తమ ప్రాథమిక దర్యాప్తులో జడేజా మాస్క్ వేసుకున్నాడని అయితే అతడి భార్య వేసుకోలేదని తేలినట్లు వెల్లడించారు. -
లేడీ అండ్ ఆర్డర్
ఆమె మంచికోసమే చెప్పి ఉంటారు. ‘వదిలెయ్.. వాళ్లు పెద్దవాళ్లు..’ అని! అంటే... డ్యూటీని వదిలేయమనా?! లా అండ్ ఆర్డర్ని వదిలేయమనా?! మనమేం చేయలేం, చేతులు ఎత్తేయమనా?! పోలిస్ అయింది.. పట్టుకోడానికి కానీ వదిలేయడానికా! మొత్తంగా ఉద్యోగాన్నే వదిలేసింది సునీత. ఆర్డర్లో ఉంచలేనప్పుడు యూనిఫామ్ ఎందుకనుకున్నట్లుంది. లేడీ ‘సింగం’ గర్జిస్తే ఎలా ఉంటుంది? లేడీ ‘సింగం’ తీక్షణంగా చూస్తే ఎలా ఉంటుంది? సినిమాల్లో కాదు. నిజంగానే ఒక లేడీ పోలీస్.. ‘లా అండ్ ఆర్డర్’ డ్యూటీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నెట్లోకి వెళ్లి చూడండి. ఒక ఆడియో, ఒక వీడియో! గత మూడు రోజులుగా దేశమంతా సునీతా యాదవ్ గర్జనని ఆడియోలో వింటోంది. ఆమె తీక్షణతను వీడియోలో చూస్తోంది. బాలీవుడ్ నటి స్వరాభాస్కర్.. ‘వారెవ్వా.. సునీతా!’ అని హ్యాట్సాఫ్ చెప్పారు. మరో నటి తాప్సీ పన్ను ‘సెల్యూట్ సునీతా’ అన్నారు. ఇండియన్ పోలిస్ ఫౌండేషన్.. సునీత ‘సెన్సాఫ్ డ్యూటీ’ని, ‘బ్రేవరీ’ని ప్రశంసించింది. ‘‘ఒక మహిళా పోలిస్ తన విధి నిర్వహణలో గట్టిగా నిలబడితే, ఆమె పైనున్న అధికారులు జారిపోకూడదు’’ అని ఫౌండేషన్ ఆమెకు గట్టి మద్దతునిస్తూ మాట్లాడింది. అయినా జారిపోయారు. ఒక్కొక్కరూ సునీత పక్కనుంచి తప్పుకున్నారు. మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొడుకు స్నేహితుడిని నోరు మూయిస్తున్న సునీత మొదట ఆమెను ఉన్నఫళంగా ఆమె చేస్తున్న వరచ్ఛ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ఫ్యూ నైట్ పెట్రోలింVŠ డ్యూటీ నుంచి తప్పించారు. తర్వాత ఆమెను సిక్ లీవుపై వెళ్లమన్నారు. తర్వాత ఆమెను సూరత్లోనే వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఆమెపై ఎంక్వయిరీ పెట్టించారు. పేరుకు అది ‘ఆనాటి ఘటన’పై ఎంక్వయిరీ. వాస్తవానికైతే సునీతపై ఎంక్వయిరీ. రిజైన్ చేసేశారు సునీత. తనంతట తను రాజీనామా చేసిందని గుజరాత్ పోలిస్ డిపార్ట్మెంట్ రిలీఫ్గా ఫీల్ అవచ్చు. సునీత ఎందుకు రిజైన్ చేయవలసి వచ్చిందో దేశమంతా చూసింది. అయితే ఆమె రాజీనామాను సంతోషంగా అంగీకరించడం ఆమె పైఅధికారులకు తేలికేమీ కాబోవడం లేదు. లాక్డౌన్ కర్ఫ్యూ నిబంధలను ఉల్లంఘించి ఐదుగురు స్నేహితులతో కారులో తిరుగుతున్న అధికార పార్టీ ఎమ్యెల్యే పుత్రరత్నాన్ని సునీత ఆపినందుకు, ఘర్షణకు దిగిన అతడిని బుక్ చేసినందుకు ఇంతా అయింది! ప్రకాష్ అతడి పేరు. వరచ్ఛ మార్గ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుమార్ కనాని కొడుకు. కుమార్ కనాని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి కూడా. గత బుధవారం ప్రకాష్ తన ఫ్రెండ్స్ని వేసుకుని కారులో రోడ్డు మీదకు వచ్చినప్పుడు డ్యూటీలో ఉన్న సునీత అతణ్ణి ఆపి వివరాలు అడిగారు. ‘‘ఎమ్మెల్యే కొడుకుని’’ అన్నాడు ప్రకాష్. ఆధార్ కార్డు ఒకటి చాలు ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంటుంది అన్నట్లు తండ్రి పేరు చెప్పి ఊరుకున్నాడు. సునీత ఊరుకోలేదు. కారులోంచి దింపి అతడిని, అతడి ఫ్రెండ్స్ని నిలబెట్టారు. ఎమ్మెల్యే కొడుగ్గా తనేం చేయగలడో చెప్పాడు ప్రకాష్. పోలీస్గా తన డ్యూటీ ఏంటో అది చేశారు సునీత. చట్టం ముందు అంతా సమానమే. జూలై 8 రాత్రి ఈ ఘర్షణ జరిగితే ఎమ్మెల్యే కొడుకును, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకోడానికి నలభై ఎనిమిది గంటలు పట్టింది. వాళ్లను వదిలిపెట్టడానికి నాలుగు నిముషాలు కూడా పట్టలేదు. ‘‘నిన్ను ఇక్కడే, నువ్వు నిలుచున్న చోటే 365 రోజులు నిలబెట్టిస్తాను’’ అని సునీతను బెదిరించాడు ఆ ఎమ్మెల్యే కుమారుడు సునీతతో ఘర్షణకు దిగినప్పుడు! అయితే ఆ పంతం మరోలా నెరవేర్చుకున్నాడు. ఆ చోటులో ఆమె మళ్లీ నిలబడకుండా చేశాడు. అయితే అతడు పైచేయి సాధించింది సునీత మీద కాదు. పోలిస్ డిపార్ట్మెంట్ మీద. ఎమ్మెల్యే కొడుకును ఆపి ప్రశ్నిస్తున్నందుకు పై అధికారుల నుంచి సునీతకు ఫోను! సునీత యంగ్ పోలీస్ కానిస్టేబుల్. ‘చూసుకుని పోవడం’ అనే విద్య ఆమెకు ఇంకా పట్టుబడలేదు. రిజైన్ కూడా చేసేశారంటే అలాంటి విద్యలకు తను పట్టుబడటం ఆమెకు ఇష్టం లేదనే అర్థమౌతోంది. సునీత గురించి ఆమె ధైర్యం ఒక్కటే ఇప్పుడు ఆమె వ్యక్తిగత వివరాలలో ప్రతిచోటా కనిపిస్తోంది. అది చాలు.. గుజరాత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆమెకు ఒక ప్రమోషన్ ఇచ్చి తనని తను గౌరవించుకునేందుకు. ప్రమోషన్ అంటే ఏం లేదు. చేతికి లాఠీ ఇచ్చి, తిరిగి అదేచోట.. ఎక్కడైతే ఆమెను ఏడాది పాటు నిలబెడతానని ఎమ్మెల్యే పుత్రుడు శపథం చేశాడో.. సరిగ్గా అక్కడే మళ్లీ డ్యూటీ వెయ్యడం. అంత ధైర్యం డిపార్ట్మెంట్కి ఉందా?! -
షీ ఇన్స్పెక్టర్
పోలీస్ ఉద్యోగం మగాడిదనుకుంటారు... మగాడు తనను తాను పోలీస్ అనుకుంటాడు..ఇంట్లో పోలీస్.. ఆఫీస్లో పోలీస్.. తండ్రిగా పోలీస్.. అన్నగా పోలీస్.. భర్తగా పోలీస్..అలాంటి సమాజంలో ఒక షీ పోలీస్ ఆఫీసర్ ఎంతటి ఒత్తిడికి గురవుతుందన్నదే సోనీ కథ! ఢిల్లీ...చలికాలం.. చీకటి పడింది. ఒక అమ్మాయి సైకిల్ మీద వెళ్తోంది. కాస్త దూరమే వెళ్లాక వెనక సైకిల్ మీదే ఒకతను వెంటాడటం మొదలుపెట్టాడు. ఆమె పట్టించుకోకుండా ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. అతను ఆమెను కామెంట్ చేస్తూ సీరియస్గా ఫాలో అవుతున్నాడు. ఓ చిన్న అడ్డదారిలోకి వెళ్లి ఆగుతుంది. అతనూ ఆగుతాడు. సైకిల్ దిగి.. అతన్ని పట్టుకుని కొడ్తుంది ఆమె. ఇంతలోకి ఓ మహిళా నాయకత్వంలోని పోలీసుల బృందం వచ్చి ఆమెను ఆపుతుంది. తన వెంటపడ్తున్న వ్యక్తిని కొట్టిన అమ్మాయి కూడా పోలీసే. పేరు సోనీ. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నాయకత్వం వహించిన మహిళ ఎస్.పి. కల్పన. సోనీ కూడా ఆమె దగ్గరే పనిచేస్తూంటుంది. నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ ‘సోని’ అనే సినిమాలోనిది ఆ దృశ్యం. పోలీస్ వ్యవస్థలో వేర్వేరు కేడర్లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు మహిళల కథ ఇది. ఐపీఎస్గా ఎంత ధీశాలి అయినా ఇల్లు, కుటుంబ విషయాలకు వచ్చేసరికి సగటు ఒత్తిళ్లను తప్పక భరించే సాధారణ స్త్రీ ఆమె. భర్త కూడా ఐపీఎస్ అయితే.. తన ఉద్యోగంలో ఆయన జోక్యాన్ని సహించాల్సిన సర్వసాధారణ భార్యే ఆమె. సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్న అమ్మాయికి ఈ భారం మరింత ఎక్కువ. పోలీస్ హైరార్కీలోని నిరంకుశత్వంతో పాటు అదనంగా మహిళా ఉద్యోగుల పట్ల ఉన్న వివక్ష, మధ్యతరగతి నివాసాల్లోని మోరల్ పోలీసింగ్, విలువల వల్లింపులు, వదిలించేసుకున్నా వీడని బంధాల బేడీలు.. ఆమె మోయాల్సిన బరువులు! రెండు జీవితాలు, రెండు నేపథ్యాలు, రెండు స్థాయిల మధ్య ఉన్న వ్యత్యాసాలు.. వీటన్నిటికీ స్థానం కల్పించిన సమాజపు బుద్ధి, తీరుకు ఫ్రేమే ‘సోనీ’ మూవీ. కథలోకి .. పైన చెప్పిన ఉపోద్ఘాతమే సినిమా స్టార్టింగ్ సీన్. అసలు ఈ కథకు ప్రేరణ.. 2012, నిర్భయ ఘటన. ఆ విషాదం తర్వాత ఢిల్లీలో మహిళా భద్రతను సవాల్గా తీసుకుని నేరం జరుగుతున్న, జరిగే ప్రమాదం ఉన్న పరిసరాలను గుర్తించే ఆపరేషన్ చేపడ్తుంది కల్పన. ఆ టాస్క్ కోసం ఓ టీమ్ను ఫామ్ చేస్తుంది. అందులో సోనీ కీలక వ్యక్తి. కల్పన ఆలోచనకు వేగంగా కార్యరూపం ఇవ్వగల సామర్థ్యం ఆమెది. అందులో భాగంగానే అలా రాత్రిపూట గస్తీకి వెళ్తారు. ఒకసారి ఒక నేవీ ఆఫీసర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో సోనీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. అతని దవడ పగలకొడ్తుంది సోనీ. ఆ వ్యక్తి రాజకీయంగా తనకున్న పలుకుబడితో సోనీ మీద క్రమశిక్షణ చర్య తీసుకునేలా ప్రెజర్ తెస్తాడు. దాంతో ఆమెను ఆ ఆపరేషన్ నుంచి తప్పించి రికార్డ్స్ రూమ్కి పరిమితం చేస్తారు. ఇది సోనీకే కాదు కల్పనకూ కష్టంగానే మారుతుంది. టాస్క్లో సోనీ రీ అప్పాయింట్మెంట్ కోసం కమిషనర్ అయిన తన భర్త సందీప్ సహాయం కోరుతుంది కల్పన. సాయమేమో కాని కింది ఉద్యోగులతో ఎలా ఉండాలో పాఠాలు చెప్తాడు. సబార్డినేట్స్ పట్ల అంత సానుభూతి అక్కర్లేదని క్లాస్ తీసుకుంటాడు. మౌనంగా వింటుంది. భర్త దగ్గర కల్పన పాత్ర అది. ఆమెకు పిల్లలు ఉండరు. అత్తగారు పిల్లల కోసం షంటుతూ ఉంటుంది. ఆడబిడ్డా తనకు మంచి గైనకాలజిస్ట్ తెలుసని, వెళ్లి కలవమని సలహా ఇస్తుంది. ఇక్కడా మౌనమే ఆమె ఆయుధం. ఆవేశం కల్పనకు వ్యతిరేకం సోనీ. అన్నిటికీ ఆవేశంగా రియాక్ట్ అవుతూంటుంది. సహనానికీ హద్దు ఉండాలి అన్నది ఆమె ఫిలాసఫి. కెరీర్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ అడ్డంకులను ఎదుర్కొంటుంది. భర్త నవీన్తో విడాకులైపోయి ఒంటరిగా ఉంటూంటుంది. అయినా రెండు రోజులకు ఒకసారి ఆమె ఉండే చోటికి వచ్చి ఇబ్బంది పెడ్తూంటాడు. చుట్టుపక్కల వాళ్లు సోనీ దగ్గర సొద పెడ్తూంటారు.. ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటావ్.. ఆడదానికి పెళ్లే పరమావధి ఎట్సెట్రా.. ఎట్సెట్రా అంటూ! నన్ను నేను చూసుకోగలను అని గట్టిగానే సమాధానమిస్తుంది సోనీ. ఆమె వ్యక్తిగత ఇబ్బందుల గురించి తెలుసుకున్న కల్పన సోనీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు తుంది. అంత ఆవేశం పనికిరాదని సుతిమెత్తగా హెచ్చరిస్తూంటుంది. లేడీస్ వాష్రూమ్లో.. ఒక రాత్రి.. పహారా కాస్తూ.. ఆకలిగా ఉంటే దార్లో ఉన్న హోటల్కి వెళ్తారు. టిఫిన్ ఆర్డర్ ఇచ్చాక వాష్ రూమ్కి వెళ్తుంది సోనీ. అప్పటికే అక్కడ తన అయిదేళ్ల కూతురితో ఓ అమ్మ ఉంటుంది క్యూలో. వాళ్లతో ఆ మాటా ఈ మాటా మాట్లాడ్తూండగానే ‘‘అమ్మా....అర్జంట్’’ అంటూ ఆ పాప ఇబ్బంది పడ్తుంది. అప్పుడు ఆ పాప తల్లి ‘‘చాలా సేపయింది. లోపల ఉన్నవాళ్లు బయటకే రాలేదు’’ అని చెప్తుంది సోనీతో. ‘‘అవునా?’’ అంటూ సోనీ వాష్రూమ్ తలుపు తడ్తుంది. రెస్పాన్స్ ఉండదు. మళ్లీ తడ్తుంది కొంచెం గట్టిగా. ఈసారీ నో రెస్పాన్స్. దబదబ బాదుతుంది సోనీ. ఒక్కసారిగా వాష్ రూమ్ తలుపు తెరుచుకుంటుంది. గుమ్మంలో జులపాలతో ఓ అబ్బాయి. లోపల మరో నలుగురు అబ్బాయిలు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్తో. ‘‘లేడీస్ వాష్రూమ్లో ఏం చేస్తున్నారు?’’ అంటూ ప్రశ్నిస్తుంది సోనీ. గుమ్మంలో ఉన్న అబ్బాయి అమర్యాదగా మాట్లాడ్తాడు. లోపలున్న వాళ్లు నవ్వుతారు. ‘‘మర్యాదగా బయటకు రండి’’ అంటూ హెచ్చరిస్తుంది. హేళన చేస్తూ తలుపు వేయబోతాడు. అడ్డుకుంటుంది సోనీ. బూతులు మొదలుపెడ్తాడు. చెంప చెళ్లు మనిపిస్తుంది సోనీ. కోపంతో ఆ అబ్బాయి సోనీ జుట్టుపట్టుకొని లోపలికి ఈడుస్తాడు. గొడవ పెద్దదవుతుంది. ఈ వివాదమూ సోనీ కెరీర్కే చుట్టుకుంటుంది. ఎందుకంటే అవతలి అబ్బాయి సెంట్రల్ కేబినెట్లో ఉన్న ఓ మంత్రికి ఎలక్షన్ ఫండింగ్ చేస్తున్న వ్యక్తి కొడుకు. ఈ సంఘటనలోనూ కల్పన భర్త నుంచి కల్పనకు సుద్దులు, బుద్ధులు, చీవాట్లు, జాగ్రత్తలు యాజ్యూజ్వల్. మరుసటి రాత్రి.. సోనీ వాళ్లింటికి వస్తుంది కల్పన. సోనీ చేతికి ఉన్న కట్టును చూస్తూ ‘‘ఈ గాయం వాడు చేసిందేనా?’’ ప్రశ్నిస్తుంది కల్పన. సోనీకి చిర్రెత్తుకొస్తుంది. ‘‘అన్నీ తెలిసీ మీరూ అలాగే మాట్లాడుతున్నారా?’’ అంటూ బరస్ట్ అవుతుంది సోనీ. ‘‘నువ్వు వాడి మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను అక్కడే ఉన్నా కదా? నాకు చెప్పి ఉంటే అరెస్ట్ చేసేవాళ్లం.ఈ గతి పట్టేది కాదు’’ అంటుంది కల్పన చాలా స్థిరంగా. ‘‘ఇప్పుడూ అరెస్టే కదా చేశాం’’ అని సోనీ అంటూండగానే ఆమె డైనింగ్ ఏరియా కిటికీ అద్దాలు భళ్లున పగుల్తాయి. కిటికీ వైపు దూసుకెళ్లి కిందకు చూస్తుంది. బైక్స్ మీద పారిపోతూ కనిపిస్తారు ఆకతాయిలు. నేను లేకపోతేనే.. ఇంట్లో దాడి జరిగిన రాత్రే సోనీ భర్త వస్తాడు. ‘‘నేనుంటే ఇలా జరిగేది కాదు’’ అంటాడు. తీక్షణంగా చూస్తుంది భర్తను. తల వంచుకుంటాడు. అప్పటిదాకా తను చేసిన తప్పులన్నిటినీ క్షమించి కలిసి ఉండటానికి ఒప్పుకోమని బతిమాలుతాడు సోనీని. ఇక నుంచి బాధ్యతగా ఉంటానని చెప్తాడు. అతనిని నమ్మక తప్పని పరిస్థితిని కల్పిస్తాడు. ఇటు ఉద్యోగంలో పై అధికారుల సపోర్ట్ లభించకపోయేసరికి రాజీనామా చేయాలని నిశ్చయించుకుంటుంది సోనీ. ఆ మర్నాడు కల్పన.. వాళ్ల ఆడపడచు ఇంటికి వెళ్తుంది. టెన్త్ క్లాస్ చదువుతున్న తన మేనకోడలు దిగులుగా తన గదిలో కూర్చుని ఉంటుంది. ఏమైంది అని అడిగితే.. పీరియడ్స్ వల్ల మాటిమాటికి వాష్రూమ్ వెళ్తుంటే క్లాస్లో బాయ్స్ ఏడిపించారని. తన ఫ్రెండ్స్ కూడా వంతపాడారని చెప్తుంది. ‘‘ఏడిస్తే ఎవరైనా ఏడిపిస్తారు. లెక్క చేయకపోతే ఎవరూ జోలికి రారు’’ అని ధైర్యం చెప్తుంది. తన మేనకోడలికి మోరల్ సపోర్ట్ ఇస్తూన్నప్పుడే సోనీ గుర్తొస్తుంది కల్పనకు. వెంటనే ఆమె దగ్గరకు బయలుదేరుతుంది.. ‘‘రసీదీ టికెట్’’ అనే అమృతా ప్రీతమ్ ఆటోబయోగ్రఫీ బుక్ తీసుకుని! దాన్ని సోనీకి ఇస్తుంది చదవమని. అలాగే రాజీనామా చేయొద్దనీ చెప్తుంది. ఆఫీస్లో.. లేడీస్ వాష్రూమ్లో చేరి సిగరెట్, మందు కొడ్తున్న వాళ్ల మీద బలమైన కేసులు పెట్టమని తన కింది అధికారులకు పురమాయిస్తుంది కల్పన.అన్ని ఒత్తిళ్లకూ ఫుల్స్టాప్ పెట్టి.. పని చేయడానికి సిద్ధ పడ్తుంది. టాస్క్ను ముందుకు సాగిస్తుంది. ఇక్కడితో ఎండ్ అయిన ఈ సినిమా అంతా దాదాపుగా సింగిల్ టేక్స్లో షూట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేని ‘సోనీ’ ఇప్పటికే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్లింది. దర్శకుడు ఇవన్ అయ్యర్. సోనీగా.. గీతికా విద్యా ఒహ్లయాన్, కల్పనగా సలోనీ బాత్రా నటించారు.
Related News by category
-
తొమ్మిది నెలల కిందే బన్నీకి సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్..
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ను తొమ్మిది నెలల కిందే సాక్షి మీడియా గ్రూప్ ఎక్స్లెన్స్ అవార్డ్తో సత్కరించింది. పుష్ప సినిమాలో వినూత్నమైన నటనతో పాటు తెలుగు అభిమానులను అత్యద్భుతంగా అలరించినందుకు ఎక్స్లెన్స్ అవార్డ్తో గౌరవించింది. ఆ సందర్భంగా మాట్లాడిన స్టైలిష్ స్టార్.. సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్కు థ్యాంక్యూ చెప్పారు. సాక్షి ఇచ్చిన ఎక్స్లెన్స్ అవార్డ్ను మూవీ టీంకు డెడికేట్ చేస్తున్నట్లు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్లో అల్లు అర్జున్కు మోస్ట్ పాపులర్ హీరో అవార్డ్.. -
Hello Meera Movie: హాలో మీరా.. దర్శకుడి గొప్ప ప్రయోగమిది!
రాతి పులుసు 'అనే యూరప్ జానపద కథ ఒకటి ఉన్నది. భలే చమత్కారమైన కథ. వీలయినంత గుర్తున్నది చెప్పడానికి ప్రయత్నిస్తా రండి.' ఒకానొక మనిషి కాలినడకన తోవ పట్టుకు పోతున్నాడు. ఎక్కడికో తెలీదు. నడిచీ నడిచీ కడుపులో దహించుకుపోయేంత ఆకలి. మనిషి మట్టి కొట్టుకు పోయి ఉన్నాడు. జేబులో నాలుగు డబ్బులు ఉండి ఉంటే ఏ బండి చక్రాన్నో పట్టుకునేవాడు. ఆ మాత్రం కూడా లేనట్టు ఉంది. నడవగా నడవగా ఒక ఊరు తగిలింది. మొదట కనపడిన ఇంటి తలుపు ముందు నిలబడి తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమని అడిగాడు. ఇంట్లో ఏముందో ఏంలేదో తెలీదు. ఇతగాడి వాలకం చూస్తే మాత్రం ఏమీ పెట్టబుద్ది అయినట్లు లేదు. రెండో ఇల్లు అంతే, ఆ ఇంటి తరువాత ఒక నాలుగు గడపలు దాటి అడిగినా అయిదో ఇంట్లో కూడా అదే స్పందన. మన కథానాయకుడు ఎవరైనా కానీ, ఏమైనా కానీ చాలా తెలివైన వాడు. ప్రాధేయపడి అడిగాం ఫలితం లేదు ఈ ఊరిలో ఇది కాదు పద్దతి అనుకున్నాడు. ఈసారి తలుపు తట్టిన ఇంటి వారికి మాత్రం తినడానికి ఏమైనా ఇవ్వండి అని అడగలేదు. ఇప్పుడే ఇస్తా ఒక కుండ ఉంటే ఇవ్వమని అడిగాడు . కుండ ఇచ్చినావిడ తలుపుకానుకుని ఏం చేస్తాడా అని చూస్తుంది. కుండని అలా నేలమీద పెట్టి అటు ఇటూ కనపడిన మూడు రాళ్లని, కాసింత ఎండు కొమ్మలు, గడ్డి పోచలు పట్టుకు వచ్చి మూడు రాళ్ల పొయ్యిగా ఆమర్చి దానిపై కుండని పెట్టి పొయ్యి వెలిగించ బోతూ వెనక్కి తిరిగి, కాసిన్ని మంచి నీళ్లు దొరుకుతాయా అవి ఉంటే చాలు పని అయిపోతుంది అన్నాడు. ఆవిడ కుండ నిండా నీళ్లు తెచ్చి ఇచ్చి చోద్యం చూస్తుంది. మనవాడు కుండ కింద మంట పెట్టి జేబులో చేయి పెట్టి ఒక గులక రాయిని బయటకు తీశాడు, భక్తిగా కళ్లకద్దుకుని ఆ రాయిని కుండలో జార విడుస్తూ ఆవిడ కేసి చూసి నవ్వాడు మరేం లేదమ్మా పులుసు రాయి అంతే అన్నాడు. పులుసు రాయా, అదేంటి ఎప్పుడూ వినలేదే ? అని వింత పోయింది ఆవిడ. ఈ రాయి వేసి పులుసు కాస్తే ఉంటుంది , అబ్బా అని లొట్టలేసి చూస్తారుగా అంటూ ఒక కర్ర పుల్ల తీసుకుని కుండలో కలియతిప్పడం మొదలు పెట్టాడు. తిప్పి తిప్పి మరిగిన నీళ్లు కాసిన్ని నాలుక మీద వేసి రుచి చూసుకుని అహా అన్నట్టు కనుబొమలు ఎగరేసి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఈ రాయి చమత్కారం విని ఇరుగింటి ఆశమ్మ, పొరుగింటి పోశమ్మ, ఎదురింటి బూశమ్మ తతిమ్మా అమ్మలు కూడా చేరారు. పులుసు తయారీ దారు తనలో తాను అనుకున్నట్టుగా అంటూనే వారికి వినిపించేలా, బావుంది, చాలా బావుంది కానీ కాస్త చింతపండు, ఉప్పు, ఇంత జీలకర్ర ఉండి ఉంటే ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఈ మాటలు చెవిన పడ్డమే ఆలస్యం వెంటనే దినుసులు దిగి పోయాయి. చిరు నవ్వుతో వాటిని అందుకుని ఆ నీళ్లలోకి వంపాడు, పులుసు మరుగుతోంది, ఆవిరి తేలుతోంది. ఏం పర్లేదు కాస్త సమయం పడుతుంది. అన్నట్లూ మీరు పుట్టి బుద్ది ఎరిగిన దగ్గరి నుంచి ఈ ఊరు దాటి పొయిన వారిలా లేరు, ఇక్కడి నుండి దక్షిణం వైపుకు వంద మైళ్ల దూరంలో జింత్ర అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో పండుతాయండి క్యారెట్లు అబ్బో ఎంత రుచి అనుకున్నారు, ప్రపంచంలో అట్లాంటి కారెట్లు మరెక్కడా దొరకవు. వస్తున్నప్పుడు పాపం ఒక రెండు దుంపలు మీకోసం తేవాల్సింది. అన్నట్లూ మీ ఊర్లో క్యారెట్ ఎట్లా ఉంటాయి, పర్లేదా? అనే ప్రశ్న ముగిసి ముగియకమునుపే ఒకావిడ క్యారెట్ బుట్ట పట్టుకు వచ్చింది. ఆ బుట్టలోనే ఒక వైపు ఉర్లగడ్డలు కూడా ఉన్నాయి. పర్లేదే! చూడ్డానికి రంగు బాగా ఉన్నాయి, రుచి పరీక్షిస్తే పొలా అని ఒక చేత్తో నాలుగు కేరట్ దుంపలు ఇంకో చేత్తో ఆరు ఉర్లగడ్డలు ఆ మరుగు తున్న నీటిలో పడేసీ మళ్ళీ కబుర్లు మొదలు పెట్టాడు. ఉర్లగడ్డ పడిందిగా పులుసు చిక్కనయింది, ఘుమఘుమలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ పుల్ల పట్టుకు తిప్పి రుచి చూడబోయాడు, ఈ సారి ఒక ఇల్లాలు చేయి చాపింది, పులుసు చుక్కలు ఆవిడ చేతిలో ఒంపాడు, ఆవిడ తన అరచేతిని నాకేసి తన్మయత్వంగా మొహం పెట్టింది, మరి ఇంట్లో తరిగిన క్యాబేజీ పోగులు ఉన్నాయి అవి కూడా వేద్దామా? అని అడిగింది. దానికేమమ్మా భాగ్యం? పులుసు రాయి దేనినయినా రుచితుల్యం చేస్తుంది పాపం వెళ్లి తెచ్చుకోండి అని ఉదారంగా అనుమతి ఇచ్చేశాడు. మొత్తానికి ఆసారి ఆయిన్ని, ఈసారి ఈయిన్ని దినుసులు చేరుతూనే ఉన్నాయి. ఇంతలో వేటకని అడివికి వెళ్లిన మగవాళ్లు పల్లెకు వచ్చేశారు. నలుగుడు ముక్క లేకుండా పులుసు ఏమిటి అని ఒక పెద్దాయన కోప్పడి తను వేటాడి తెచ్చిన కుందేళ్ల తాజా మాంసం ముక్కలు అందులో మరగనిచ్చాడు. పులుసు తయారు. అంతకన్నా అద్భుతమైన పులుసు ముందెన్నడూ తిని ఎరగలేదని తిన్నవాళ్లంతా ఏకగ్రీవపడ్డారు. తాను కూడా ఆ ఊరి అంత మంచివాళ్లని మునెపెన్నడూ ఎరిగి ఉండనని దానయ్య కూడా ప్రకటించి తన గుర్తుగా ఉంచుకొమ్మని కానుకగా ఆ పులుసు రాయిని వారికి ఇచ్చేసి తన దారి తాను చూసుకున్నాడు . ఈ కథని మా మిత్రుడు శ్రీనివాస్ చదివి కాని, విని కాని ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయనకు ఈ కథకు ఉన్న సంబంధం అల్లా, ఎట్లా అయితే ఆ కథలో కథానాయకుడు వనరులు ఏమీ లేని చోట, నలుగురూ నాలుగు చేతులు వేసినప్పుడు ఒక మహద్భుతం చేయవచ్చని నమ్మికతో నడుస్తున్నాడో , శ్రీనివాస్ ది అదే నమ్మిక. సినిమాలు తీయాలి. దాని కొరకు ముందుగా ఒక సినిమా అయినా తీయాలి అనేదే ఆయన లక్ష్యం. చేతిలో మ్యాజిక్ ఉంది. కాని చూసే వాడికి అవి ఖాళీ చేతుల్లా కనపడుతున్నాయే.. మరెలా అని కథ అనే గులకరాయిని పట్టుకుని ఆయన నడక మొదలెట్టాడు. పిడికిట్లో అది ఒదిగి ఉంది. నడక అనంతరం గుప్పిట విప్పి చూస్తే అది ముత్యంలా తయారయింది. ఒక పాతికేళ్ల అమ్మాయి, పేరు మీరా. రేపొక్క రోజు ఆగితే ఎల్లుండి తన పెళ్లి. బట్టలు తెచ్చుకోడానికి బయలు దేరిన అమ్మాయి సాయంత్రం అయిదు దాటింది.. ఆరు దాటింది.. ఏడయినా ఇల్లు చేరదే ! ఎక్కడా తప్పి పోయింది లేదు .. అమ్మ చేసినా.. నాన్న చేసినా , తమ్ముడు చేసినా.. కాబోయే శ్రీవారు, వారి అమ్మగారు, చిన్ననాటి మిత్రులు ఎవరు చేసినా ఫోన్ ఎత్తుతోంది .. వారితో మాట్లాడుతూనే ఉంది.. జవాబు చెబుతూనే ఉంది. పోని ఇదేమయినా ఇష్టం లేని పెళ్లా అంటే అదేం కాదు.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడబోతుంది. మరేమిటి? ఇంటి నిండా బంధువులు, విడిదింట్లో మగపెళ్లి వారు, హోటల్ గదుల్లో మిత్రులు అంతా వచ్చి ఉన్నారు. టైలర్ షాపు నుంచి తిన్నగా ఇంటికి రావాల్సిన అమ్మాయి.. ఇంటి వైపు కాక ఊరిని వదిలి పెట్టి హైదరాబాదు నగరం వైపు.. నేషనల్ హైవే మీద ఒంటరిగా కారు నడుపుతూ వెళ్లావలసిన అవసరం ఏంటి? ఇదేం క్రైం థ్రిల్లర్ కాదు, యాక్షన్ ఓరియెంటెడ్ జానర్ అసలే కాదు. పూర్తిగా సంసార పక్ష సినిమా.. కుటుంబ గాథా చిత్రం. మనుషులు, అనుబంధాలు, నమ్మకాలు, ద్రోహాలు, కాసిన్ని కన్నీళ్లు, గోరంత దీపమంత ధైర్యం వెలుగులో కొండంత భయాన్ని ఎదుర్కొన్న ఒక ఆడపిల్ల కథ. సినిమా అంతా ఇందులో మీరా అన్న పాత్ర వహించిన గార్గేయి తప్పా మరో మనిషి మొహం కనపడదు. ఎన్నో గొంతులు వినపడతాయి. ఎన్నెన్నో భావనలు అర్థమవుతాయి. ఇందులో మనకు వినపడిన ప్రతి కరుకు గొంతు, ప్రతి మెత్తని పలుకు, ప్రతి కంగారు స్వరం ఆ మనిషి ఎలా ఉండి ఉంటారనేది మనకంటూ ఒక ఊహని కలుగ జేస్తుంది. మనం కళ్లతో సినిమా చూస్తూ.. ఊహల్లో సినిమాలోని పాత్రలని నిర్మించుకుంటాం. ఇంతకన్నా కథని ఏమి చెప్పలేను. ఇదంతా దర్శకత్వ ప్రతిభ . డైరెక్టర్ మూవీ ఇది. తెలుగులో గొప్ప ప్రయోగం ఇది. సగటు ప్రేక్షకుడి పైన ఉన్న నమ్మకం ఈ సినిమా . గర్వించే మన సినిమా ఇది. సినిమా చివరలో సుఖాంతంలో పెద్ద సమస్య నుంచి మీరా బయట పడుతుంది. ఆ మొహంలో, కళ్లల్లో, పెదవుల మీద గొప్ప రిలీఫ్ . ఆ సమయంలో ఏం చేయాలి? పిడుగును ఒడిసి పట్టి నలిపి పడేసినంత, కొండలని పిండి కొట్టి చెల్లా చెదురు చేసినంత గొప్ప ఫీల్ కావాలి. ఆ విజయాన్ని ఆస్వాదించాలి. కానీ ఆ అమ్మాయి చేసిన మొట్ట మొదటి పని తన తమ్ముడికి కాల్ కలిపి, బట్టలు కుట్టిన టైలర్కి చాలా అవసరంగా డబ్బులు కావాలి. అర్థ రాత్రి దాటి ఉన్నా పర్లేదు, ముందు ఆ అమ్మాయికి డబ్బులు అందించమంటుంది. సూది కుట్టంత చిన్న మనిషి, ఆవిడ అవసరం దగ్గర ఆపేసిన గొప్ప సినిమా ఇది. తప్పక చూడండి. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
పోస్టర్ బాగుంది – నాగార్జున
‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకునేలా బాగుంది. ఈ సినిమా హిట్ అయి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు అక్కినేని నాగార్జున. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో తేజ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక–నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: వాసు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement