‘లోఫర్’ చిత్రానికి సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్కూ, డిస్ట్రిబ్యూటర్స్ ముత్యాల రామ్దాస్, అభిషేక్, కాలి సుధీర్లకూ మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు సినీ రంగాల్లో హాట్ టాపిక్. ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లూ తనపై దాడి చేశారని పూరీ కేసు పెడితే, అవన్నీ వట్టి తప్పుడు కేసులంటూ వారు సోమవారం మీడియా ముందుకు వచ్చి వాపోయిన సంగతి మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంపై మంగళవారం ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనం ‘కట్ చేస్తే... కాంట్రవర్సీ!’కి విశేష స్పందన వచ్చింది. అలాగే, ఈ వివాదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. వారి అభిప్రాయాలు... వారి మాటల్లోనే...
కాంబినేషన్స్నే నమ్మితే ముప్పే!
‘‘ఇవాళ సినిమాల్లో నూటికి 20 సినిమాలే, అవీ క్రేజున్నవే - బయ్యర్లు కొంటున్నారు. మిగిలిన 80 శాతం సినిమాల్ని నిర్మాతలే రిలీజ్ చేసుకొని, రిస్క్ భరిస్తున్నారు. ఆ రకంగా నిర్మాతలే ఎక్కువ నష్టపోతున్నారు. మరోపక్క డిస్ట్రిబ్యూటర్లు ఇష్టపడి, పోటీపడి మరీ ‘అవుట్ రైట్’ కన్నా ఎక్కువ సొమ్ముకి ‘నాన్ రికవరబుల్ అడ్వాన్స్’ పద్ధతిలో సినిమా కొంటున్నారు. అలా కొన్నాక, తీరా నష్టమొస్తే అది ఎవరి తప్పు? కొనుక్కున్న వాళ్ళదే కదా! దాన్ని నిర్మాతో, టెక్నీషియనో భర్తీ చేయాలనడం తప్పు. లెక్కప్రకారమైతే ఎవరూ భర్తీ చేయనక్కరలేదు. రజనీకాంత్ లాంటి వాళ్ళకు చిత్ర నిర్మాణంలోనూ వాటా ఉంటుంది కాబట్టి, వారు ‘బాబా’(2002) లాంటి చిత్రాలకు కొంత మొత్తం వెనక్కి ఇస్తే ఇచ్చారు. ఐనా, నిర్మాతకూ, డిస్ట్రిబ్యూటర్కీ మధ్య జరిగిన వ్యాపార ఒప్పందంలో దర్శకుడికీ, హీరోకీ సంబంధం ఏంటి? క్రేజీ కాంబినేషన్స్ నమ్మి, సినిమాను చూడకుండానే కొనుక్కుంటే ఇదే ముప్పు. తీరా చేతులు కాలాక, అప్పుడు కొత్త చిత్రాలకు సహాయ నిరాకరణ లాంటి బ్లాక్మెయిలింగ్కు దిగితే మరీ తప్పు. ఐనా, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలు. రోడ్డు మీదకెక్కడం బాధాకరం.’’
- తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాత - దర్శకుడు
పోటీపడి కొనడమెందుకు? నష్టపోవడమెందుకు?
‘‘డిస్ట్రిబ్యూటర్స్కు 20 శాతం కన్నా మించి నష్టం వస్తే, కోటి రూపాయల పారితోషికం తీసుకొనే నటీనటులు, టెక్నీషియన్లు తమ పారితోషికంలో కొంత వెనక్కి ఇవ్వాలని ఏణ్ణర్ధం క్రితమే ఒక ప్రతిపాదన వచ్చింది. కానీ అది సాధ్యం కాదనీ, డిస్ట్రిబ్యూటర్లు తాము ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలతోనే ఆ డబ్బుల వ్యవహారం చూసుకోవాలనీ మా దర్శకుల సంఘం తరఫున లేఖ ఇచ్చే శాం. అయినా, డిస్ట్రిబ్యూటర్లు రికవరబుల్ ఎడ్వాన్స్ పద్ధతిలో కూడా సినీ వ్యాపారం చేసుకొనే అవకాశం ఉండగా, నాన్ రికవరబుల్ ఎడ్వాన్స్ (ఎన్.ఆర్.ఎ) పద్ధతిలో రేట్లు పెంచి, పోటీపడి సినిమాలు కొనడమెందుకు? నష్టపోవడమెందుకు? ఆ తరువాత నష్టం కొంతైనా భర్తీ చేసేలా డబ్బులు వెనక్కి ఇవ్వమంటూ, ‘బెగ్గింగ్ చేస్తున్నా’మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడమెం దుకు? మునుపటి చిత్రాల రిజల్ట్ను బట్టే సాగే సినిమా వ్యాపారంలో ‘ఇడియట్’ అవుతుందనుకొని ‘లోఫర్’ కొన్నామని వ్యాపారస్థులైన డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం అమాయకత్వమే. రేట్లు పెంచి టికెట్లు అమ్మడం, కెపాసిటీకి మించి హాళ్ళలోకి జనాన్ని పంపి, ఆ కలెక్షన్లను బట్టి హీరోలు, దర్శకుల పారితోషికాలు కోట్లలోకి పెరగడానికి బాధ్యత పరోక్షంగా డిస్ట్రిబ్యూటర్లదే. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకిస్తున్న ఆన్లైన్ టికెట్ విధానాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు తెస్తే, పారదర్శకత వస్తుంది. నిర్మాతకు సరిగ్గా డబ్బు, ప్రభుత్వ ఖజానాకు వినోద పన్ను మొత్తం అందుతాయి. దానికి శ్రీకారం చుట్టాల్సింది డిస్ట్రిబ్యూటర్లే!’’
- వీరశంకర్, ప్రముఖ దర్శకుడు - ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ అధ్యక్షుడు
ఇప్పుడిక ఒళ్ళు దగ్గర పెట్టుకొంటారు!
‘‘ఒకప్పుడు ఎన్టీయార్, కృష్ణ, చిరంజీవి గారి లాంటి హీరోలకు పర్మనెంట్గా, స్టాండర్డ్ నిర్మాతలుండేవారు. డిస్ట్రి బ్యూటర్లూ ఉండేవారు. అందరూ ఒకరి కష్టనష్టాలను మరొకరు పంచుకొనేవారు. ఇవాళ తెలుగులో ఏ హీరోకూ పర్మనెంట్ నిర్మాతలూ, డిస్ట్రిబ్యూటర్లూ లేరు. హీరోలు, దర్శకులు మార్కెట్కు మించి ఎక్కువ డబ్బులు అడుగుతు న్నారు, తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం వ్యవస్థే నాశనమైంది. నిర్మాతలకూ, హీరోలకూ డబ్బులు రావడానికి కారణమైన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల వాళ్ళు కూడా లేకుండా పోతే, ఇక సినిమాలు రిలీజ్ చేసేదెవరు? ఆడేదెవరు? కాబట్టి, వాళ్ళను కాపాడుకోవాలి. సినిమాలో నష్టమొస్తే, దర్శక, హీరోలు డబ్బులు వెనక్కివ్వాలి. డెరైక్టర్ డబ్బులు వెనక్కివ్వడం ‘ధైర్యం’ (2005) సినిమాతో నాతోనే మొదలైంది. సినిమా ఆడక పోతే, డబ్బు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందంటే అప్పుడు దర్శకులు, హీరోలు ఒళ్ళు దగ్గరపెట్టుకొని, సరైన కథలతో సిన్మా తీస్తారు. కాబట్టి, డబ్బులు వెనక్కి ఇమ్మని డిస్ట్రిబ్యూటర్లు అడగడం శుభపరిణామం. నాకు నచ్చింది.’’
- తేజ, ప్రముఖ దర్శకుడు - నిర్మాత - పంపిణీదారు - ప్రదర్శకుడు
వెనక్కివ్వాలా? వద్దా?
Published Tue, Apr 19 2016 11:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement