దండకారణ్యంలో శాంతి కోసం...! | Sakshi
Sakshi News home page

దండకారణ్యంలో శాంతి కోసం...!

Published Sat, Jul 4 2015 11:05 PM

దండకారణ్యంలో శాంతి కోసం...!

‘‘త్రేతాయుగంలో సీతారాములకు, ద్వాపరయుగంలో పాండవులకు ఆశ్రయం కల్పించిన దండకారణ్యం ఇప్పుడు క ష్టాల్లో ఉంది. అక్కడ ఉండే ఆదివాసీలు ఇప్పడు నానా కష్టాలు పడుతున్నారు. అర ణ్యం అనేది తుపాకీ రాజ్యం కాకూడదు. అక్కడ శాంతి కోసం ఎలాంటి పోరాటం జరిగిందన్నదే ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం’’ అని దర్శక, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అంటున్నారు. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నారాయణమూర్తి హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘దండకారణ్యం’. ‘‘మా సంస్థలో వస్తున్న 28వ చిత్రమిది. ఇందులో మొత్తం 9 పాటలు ఉంటాయి. వైజాగ్, విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని ఆర్.నారాయణమూర్తి తెలిపారు.
 

Advertisement
Advertisement