లైవ్లో రజనీకాంత్ను చూస్తే, అభిమానులు ఎగబడతారు. అందుకే ‘క్రౌడ్ను కంట్రోల్ చేయడం కష్టం సార్! రిస్క్ ఎందుకు? ఓ సెట్ వేసి, అందులో షూటింగ్ చేద్దాం’ అని దర్శకుడు పా. రంజిత్కు చిత్రబృందం సలహా ఇస్తే ఆయన చాలా సింపుల్గా ‘నో’ అనేశారట! పైగా, ‘లైవ్ లొకేషన్స్లోనే షూట్ చేస్తా’ అనడంతో అల్లుడు ధనుష్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా యూనిట్ తట్టాబుట్టా, కెమెరాలు గట్రా ప్యాక్ చేసుకుని రెండ్రోజుల క్రితం చెన్నై నుంచి ముంబయ్కి చెక్కేశారు.
‘కబాలి’ తర్వాత రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ మరో గ్యాంగ్స్టర్ సిన్మా చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబయ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వీలైనంత వరకు లైవ్ లొకేషన్స్లో షూట్ చేయాలని దర్శకుడు ఫిక్స్ కావడంతో సెట్స్ వేయాలనే ఆలోచనను విరమించుకున్నారట. హీరో లేకుండానే నిన్న షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ 28న రజనీ షూటింగ్లో జాయిన్ అవుతారని సమాచారం. ముంబయ్లోని ధారావీలో ఎక్కువ పార్ట్ షూట్ చేస్తారట! సో, ముంబయ్ జనాలకు త్వరలోనే రజనీని లైవ్లో చూసే ఛాన్స్ దక్కుతుంది.