నక్షత్రం లోగో లాంచ్ చేసిన చెర్రీ | Sakshi
Sakshi News home page

నక్షత్రం లోగో లాంచ్ చేసిన చెర్రీ

Published Sat, Oct 8 2016 2:07 PM

నక్షత్రం లోగో లాంచ్ చేసిన చెర్రీ

గతంలో ప్రకటించినట్టుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నక్షత్రం చిత్ర టైటిల్ లోగో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్, తన సెట్స్ నుంచి ఈ సినిమా లోగోను రిలీజ్ చేశారు. నక్షత్రం చిత్ర దర్శకుడు కృష్ణవంశీతో గతంలో రామ్ చరణ్ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాను తెరకెక్కించాడు. ఆ స్నేహంతోనే చెర్రీ కృష్ణవంశీ సినిమా లుక్స్ను రిలీజ్ చేసేందుకు అంగీకరించాడు.

సందీప్ కిషన్, రెజీనాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో సాయి ధరమ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్లు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పది లుక్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన కృష్ణవంశీ అన్ని లుక్స్ను రామ్ చరణ్ చేతులు మీదుగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను శ్రీనివాసులు, సజ్జు, వేణుగోపాల్ లు నిర్మిస్తున్నారు.

 

Advertisement
Advertisement