టాటా.. వీడుకోలు .. ఇంక సెలవు... ఇదిగో ఇలాగే ‘రంగస్థలం’ టీమ్లోని ఒక్కొక్కరికి ఒక్కోలా చెప్పి, ఎంటైర్ షూట్కు ప్యాకప్ చెప్పారు సమంత. రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. ఇందులో సమంత కథానాయిక.
ఈ సినిమా చిత్రీకరణను శనివారంతో కంప్లీట్ చేశారు చిత్రబృందం. ‘‘షూటింగ్ కంప్లీట్ చేశాం. మోస్ట్ స్పెషల్ టీమ్తో నేను చేసిన స్పెషల్ మూవీ ఇది. వర్క్ చేసిన అందరి కెరీర్ను ఇంకో మెట్టు పైకి ఎక్కించే చిత్రమిది. బిగ్ బ్యాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు సమంత. ఈ సినిమాను మార్చి 30న విడుదల చేయాలనుకుంటున్నారు.