బాబా భక్తుల అనుభవాలతో... | Sakshi
Sakshi News home page

బాబా భక్తుల అనుభవాలతో...

Published Wed, Sep 7 2016 11:49 PM

బాబా భక్తుల అనుభవాలతో...

విజయచందర్ సాయిబాబాగా  నటించిన తాజా చిత్రం ‘సాయే దైవం’. జీఎల్‌బీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ, పొనుగోటి భవాని అర్జున్‌రావుతో కలిసి నిర్మించారు. ఘటికాచలం సంగీతం అందించిన ఈ చిత్రం పాటల సీడీని విజయచందర్ విడుదల చేశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలి చైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు. ‘‘బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని దర్శక-నిర్మాతలు అన్నారు. ‘‘30 ఏళ్ల క్రితం ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’లో సాయిబాబా పాత్ర చేశా. మళ్లీ ఆ పాత్ర చేసే చాన్స్ రావడం నా అదృష్టం’’ అని విజయచందర్ అన్నారు.
 

Advertisement
Advertisement