అవార్డుతో బాధ్యత పెరిగింది : భూపాల్ | Sakshi
Sakshi News home page

అవార్డుతో బాధ్యత పెరిగింది : భూపాల్

Published Thu, Aug 27 2015 12:55 AM

అవార్డుతో బాధ్యత పెరిగింది : భూపాల్

అంతర్జాతీయ స్థాయిలో తమ లఘు చిత్రానికి గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు ‘మాభూమి’, ‘దాసి’ చిత్రాల ఫేమ్ భూపాల్. ఆయన నటించిన ‘ఎంతెంత దూరం’ లఘుచిత్రానికి ఇటీవల అమెరికాలో జరిగే ‘వరల్డ్ మ్యూజిక్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో రెండు అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడిగా భూపాల్‌కీ, ఉత్తమ దర్శకుడిగా వేణు నక్షత్రంకూ పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ ‘‘ఇప్పుడున్న విద్యావిధానంలోని లోపాలు ఎత్తి చూపిస్తూనే, చదువుకు కులం అనే అడ్డుగోడ ఉండకూడదనే సందేశాన్నిచ్చాం.

తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మళ్లీ ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో రెండు పురస్కారాలు దక్కడంతో మా మీద మరిన్ని మంచి చిత్రాలు తీసే బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను’’ అన్ని అన్నారు. ‘‘ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య జీవితాన్ని డాక్యుమెంటరీగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నా. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలి ఉంది’’ అని భూపాల్ తెలిపారు.
 

Advertisement
Advertisement