ఇకపై ఆ పాటే పాడుతా | Sakshi
Sakshi News home page

ఇకపై ఆ పాటే పాడుతా

Published Fri, May 6 2016 3:04 AM

singer ganabala said i dont sing like drunk songs

 ఇకపై పాండియోడ గలాట తాంగల చిత్రంలోని పాటే పాడుతాననీ అంటున్నారు ఆ పాటకు సొంతదారుడు గానాబాలా. గత ఏడాది గాయకుడిగా విజృంభించిన ఈయన ఇప్పుడు స్పీడు తగించారనే చెప్పాలి. పాండియోడ గలాట తాంగల చిత్రం కోసం తనే సొంతంగా పాట రాసి పాడి నటించడం విశేషం. నితిన్‌సత్య, రక్షరాజ్ జంటగా నటించిన చిత్రం పాండియోడ గలాట తాంగల. మయిల్‌సామి, ఇమాన్‌అన్నాచ్చి, మనోబాలా, సింగంపులి, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎస్‌టీ.గుణశేఖరన్ దర్శకత్వం వహించారు.

మణికండన్,నాగేశ్వరన్‌లు నిర్మించిన ఈ పాండియోడ గలాట తాంగల చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. దర్శకుడు అరవింద్‌రాజ్, జనరాధన్‌లు అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో గాయకుడు గానాబాలా మాట్లాడుతూ తాగుడు పాటల గాయకుడిగా ముద్ర పడడంలో అలాంటి పాటలను పాడడం తగ్గించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నానన్నారు. అలాంటి సమయంలో ఈ చిత్రం దర్శక నిర్మాతలు ఒక మంచి అడ్వైజ్ పాటను రాసి, మీరే పాడి నటించాలని కోరారన్నారు. నిజంగా సంతోషం కలిగిందని అన్నారు. పాండియోడ గలాట తాంగల చిత్రం కోసం రాసి పాడి నటించిన ఈ పాటను ఇకపై తాను పాల్గొనే అన్ని వేదికపై పాడుతాననీ గానాబాలా అన్నారు.

Advertisement
Advertisement