'ఈ చిత్రం నా కెరీర్లో మైలురాయి' | Sakshi
Sakshi News home page

'ఈ చిత్రం నా కెరీర్లో మైలురాయి'

Published Sat, Oct 3 2015 6:02 PM

'ఈ చిత్రం నా కెరీర్లో మైలురాయి' - Sakshi

ముంబై: సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రం తన కెరీర్లో అతిపెద్ద మైలురాయి అవుతుందని బ్రిటిష్ మోడల్, నటి అమీ జాక్సన్ అన్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్తో కలసి నటించే అవకాశం రావడం తన అదృష్టమని అమీ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో ఓ థియేటర్లో ఈ చిత్రాన్ని చూసిన అమీ ప్రేక్షకుల స్పందన బాగుందని చెప్పారు.  

2010లో తమిళ చిత్రం 'మద్రాసపట్టణం'  ద్వారా అమీ తన కెరీర్ ప్రారంభించారు. 2012లో' ఏక్ దీవాన థ' చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు. చాలామంది స్టార్స్తో కలసి నటించాలని ఉందని, ఈ జాబితా పెద్దదేనని అమీ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement