ధనుష్ కు నో.. 'ప్రిన్స్'కు ఓకే | Sakshi
Sakshi News home page

ధనుష్ కు నో.. 'ప్రిన్స్'కు ఓకే

Published Thu, Apr 21 2016 2:13 PM

ధనుష్ కు నో.. 'ప్రిన్స్'కు ఓకే

చెన్నై: 'ప్రిన్స్' మహేశ్ బాబు తర్వాతి సినిమాలో విలన్ గా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ఖరారయ్యాడు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమాలో ప్రతినాయకుడిగా సూర్య కనిపించనున్నాడు. దీనికోసం ధనుష్ సినిమాను అతడు వదులుకున్నాడు. ధనుష్ తాజా చిత్రం 'ఎనాయ్ నొక్కి పాయుమ్' కోసం సూర్యను సంప్రదించారు. అయితే మహేశ్ సినిమాకు కమిట్ అవడంతో ఈ ఆఫర్ తిరస్కరించాడని చిత్రవర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే పలుచిత్రాల్లో హీరోగా నటించిన సూర్య, ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న 'ఇరైవి'లో విలన్గా చేస్తున్నాడు. మహేశ్-మురుగదాస్ సినిమా ఏప్రిల్ నెలాఖరుకల్లా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. తమిళనటి సాయి పల్లవి, కీర్తి సురేష్లతో పాటు, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పేరు కూడా తెరపైకి వచ్చాయి.

Advertisement
Advertisement