దక్షిణాదిలో ఏ కథానాయకికీ లేనంత క్రేజ్ను నటి నయనతార సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా గానీ, నటనా పరంగా గానీ ఆమె ఒక సంచలనం. ఎంట్రీ, రీఎంట్రీలకు అతీతం అనిపించుకుంటున్న స్టార్ హీరోయిన్ నయన్. ఒక పక్క హీరోలతో ప్రేమ, పాటలు అంటూ రొమాన్స్ చేస్తూనే మరో పక్క స్త్రీ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ దేనికైనా రెడీ అని సవాల్ చేస్తున్నట్లుగా ఉన్నారు. నయనతార ఇంతకు ముందు అనామిక, మాయ తదితర హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో నటించారు.
వాటిలో అనామిక నిరాశ పరచినా, మాయ నిర్మాతకు, బయ్యర్లకు యమ దుడ్డును అందించింది. కాగా ముచ్చటగా మూడోసారి సింగిల్ హ్యాండ్తో చిత్రాన్ని లాగడానికి సిద్ధం అవుతున్నారు. నయన్ నటిస్తున్న తాజా చిత్రం దోరా. హారర్, థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. విషయం ఏమిటంటే ఇంతకు ముందు నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో చిన్న పాత్ర అయినా ఆమెకు జంటగా హీరో పాత్రలు ఉన్నాయి. అలాంటిది దోరా చిత్రంలో నయన్కు లవరే ఉండరట.
అసలు రొమాన్స్ కూడా ఉండదట. ఇది హత్యా ఉదంతంతో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగే కథా చిత్రం అని తెలిసింది. పోలీస్ అధికారి పాత్రలో హరీష్ ఉత్తమన్, విలన్గా బెంగళూర్కు చెందిన సులిలే నటిస్తున్నా దోరా చిత్రాన్ని నయన్ సోలోగానే భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారన్న మాట. వివేక్-వెర్విన్ల ద్వయం సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి దాస్ రామసామి దర్శకత్వం వహిస్తున్నారు.దర్శకుడు సర్గుణం నిర్మిస్తున్న దోరా చిత్రం చెన్నై పరిసర ప్రాంతాలలోనే చిత్రీకరణ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 20 కల్లా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుందని సమాచారం.
సోలో లైఫే సో బెటర్
Published Wed, Jul 13 2016 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
Advertisement