టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తిరిగి కెమెరా ముందుకు రావడానికి రె'ఢీ' అవుతున్నారు. అందుకోసం ఆయన తన అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. త్వరలో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక150వ చిత్రం కోసం చిరంజీవి ప్రత్యేకించి 'స్పా' థెరపీ చేయించుకునేందుకు ఏకంగా కేరళ వెళ్లినట్టు సమాచారం. తమ అభిమాన నటుడి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక రకంగా తీపి కబురే. ఎందుకంటే.. ఆయన కెమెరాకు దూరమై దాదాపు ఐదేళ్లు దాటిపోయింది. 2009లో విడుదలైన 'మగధీర' తర్వాత చిరంజీవి కెమెరా ముందుకు రాలేదు.
భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం చిరంజీవి స్లిమ్ అవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన అత్యంత సన్నిహితుడు తెలిపారు. చిరు స్టెప్స్ అంటే ఇప్పటి యూత్కు కూడా ఎంతో క్రేజ్. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి తన ఆహార్యం మీద అంతగా శ్రద్ధ తీసుకోకపోవటంతో ఆయన బరువు పెరిగారు.
దాంతో అదనాన్ని తగ్గించుకునేందుకు 'చిరు' ప్రయత్నం చేస్తున్నారట. ఈజీగా మూమెంట్స్ ఇవ్వాలంటే స్లిమ్ అవ్వాలనుకున్నారట. ఇప్పటికే రోజూ వ్యాయామం చేసి కాస్తంత బరువు కూడా తగ్గారట ఈ హీరో. చిరుతో పాటు పరుచూరి బ్రదర్స్లో ఒకరు కేరళకు వెళ్లినట్లు సమాచారం. చిత్ర కథకు సంబంధించి అక్కడ కూడా చర్చలు జరుపుతున్నారట.
సరైన కథ దొరకక ఇన్ని రోజులూ చిరంజీవి వేచి ఉన్నారని.. ..ప్రస్తుతం కథ సిద్ధమైనట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చేయబోయే ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు కూడా సిద్ధం చేశారు. వీరి కలయిక అంటే అంచనాలను ఊహించలేం. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ఖైదీ, కొండవీటి దొంగ, స్టాలిన్ సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇది మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రం అయి ఉంటుందని అందరి అంచనా. ఈ చిత్రానికి దర్శకత్వం చిరంజీవితో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వి.వి.వినాయక్ వహిస్తారట. ఇంకో విశేషమేంటంటే ఈ సినిమాకి తన కుమారుడు హీరో రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తాడని టాలీవుడ్ టాక్.
'చిరు' ప్రయత్నాలు
Published Mon, Feb 2 2015 3:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement