ఆ సమయం వచ్చిందా? | Sakshi
Sakshi News home page

ఆ సమయం వచ్చిందా?

Published Fri, Jun 2 2017 12:22 AM

ఆ సమయం వచ్చిందా?

‘‘జాన్వీ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటోంది. అయితే అదెప్పుడన్నది మాత్రం చెప్పలేను’’ అని కూతురి వెండితెర అరంగేట్రం గురించి శ్రీదేవి ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పడా సమయం రానే వచ్చిందని బాలీవుడ్‌ అంటోంది.

మరాఠీ సూపర్‌ హిట్‌ మూవీ  ‘సైరాట్‌’లో షాహిద్‌ కపూర్‌ బ్రదర్‌ ఇషాన్‌ కేతర్, జాన్వీ కపూర్‌ జంటగా నటించనున్నారనే వార్త కొన్ని నెలల క్రితం వచ్చింది. ‘హామ్టీ శర్మాకి దుల్హనియా’, ‘బద్రీనాథ్‌ కి దుల్హనియా’ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన శశాంక్‌ కేతన్‌ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారన్నది తాజా ఖబర్‌. త్వరలో ఆరంభం కానుందట. ఇదిలా ఉంటే.. జాన్వీ, ఇషాన్‌ రియల్‌గానే లవ్‌లో ఉన్నారట. ఇటీవల ఈ ఇద్దరూ జంటగా ‘బేవాచ్‌’ చిత్రాన్ని తిలకించారని బాలీవుడ్‌ టాక్‌.

Advertisement
Advertisement